ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు. ఇటీవల కర్ణాటకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత యడియూరప్ప గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశముంది. రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని చెప్పారు. రాజీనామా చేస్తున్నానని చేప్పే సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు.