కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్థసారథి రెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం ప్రసాద్ రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి విషయంలో వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.