migrant workers
స్వంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలసకూలీలకు ఏడాదిపాటు ట్రావెల్ అలవెన్స్ ఇవ్వనున్నట్లు అలాగే కార్మికులకు ఉచితంగా హెల్త్చెకప్ చేయనున్నారని కేంద్ర కార్మిక, ఉద్యోగశాఖ మంత్రి సంతోష్కుమార్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లేబర్ బిల్లుతో సుమారు 50 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత ఏర్పడుతుందని అన్నారు. కార్మికులు సమ్మె చేసే అధికారం ప్రభుత్వం లాక్కోలేదన్నారు. కార్మికుల కోడ్ బిల్లు గురించి మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. గతంలో కార్మికులు లేబర్ చట్టాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవారని, ఇప్పుడు కార్మికుల కేసులన్నీ ఒక ఏడాదిలో పరిష్కారం కానున్నట్లు చెప్పారు.
Also Read: ఇష్టమొచ్చినట్లు యాప్స్ డౌన్లోడ్ చెయ్యొద్దు : కేంద్రం