ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం ముదరుతోంది. స్టేషన్ ఘనపూర్ కేంద్రంగా కడియం వర్సస్ రాజయ్యగా మారింది. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి ఈనెల 2న ముగిసింది. దీంతో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రాజయ్య ఎద్దేవా చేశారు. దీంతో రాజయ్య మాటలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ప్రజాసేవ చేయాలంటే ప్రోటోకాల్ అవసరం లేదన్నారు. తనకు ప్రజలిచ్చిన ప్రోటోకాల్ తో సేవ చేస్తానని కడియం శ్రీహరి తెలిపారు.