
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,252 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 11 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,521 కి చేరింది. కరోనా బారినుంచి నిన్న 1,436 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,975 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.