ఒక వైపు పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వర్షాకాల సమావేశాలు నడుస్తుండగా, మరోవైపు పార్లమెంట్ బయట జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో విపక్ష నేతలు కరోనా, పెగాసన్, ధరల పెరుగుదల మొదలైన అంశాలపై తమ గళం వినిపిస్తుండగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడింది.