చిన్న పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వైరస్ లోని మార్పులను అర్థం చేసుకొని ఎలా స్పందించాలో అలా స్పందిస్తామని పేర్కొన్నారు. సింగపూర్ వైరస్ రకం పిల్లల పై తీవ్ర ప్రభావం చూపుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.