
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమేపి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు సంఖ్య 5,91,170కి చేరింది. తాజాగా మరో 14 మంది మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 3,378కి పెరిగింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 3,614 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,016 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.