న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ మరో క్రికెటర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇప్పటికే ఆరుగురు క్రికెటర్లకు కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రికెట్ సభ్యుడికి కరోనా రావడంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే జట్టు సభ్యులు మొత్తం క్వారంటైన్ లో ఉన్నారు. అంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ సభ్యలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. తాజాగా మరో పాజిటివ్ నిర్దారణ కావడంతో పాక్ జట్టుకు మరోసారి హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. ఈనెల 24న జట్టు సభ్యులు న్యూజిలాండ్ కువచ్చారు. వెంటనే వారికి కోవిడ్ పరీక్షలు చేయడంతో ఒకేసారి ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. శనివారం మిగతా సభ్యలకు మరోసారి పరీక్ష చేయగా అందులో ఒకరికి కోవిడ్ నిర్దారణ అయింది. వచ్చేనెల 18న న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. అయితే ఈ టెస్ట్ నిర్వహిస్తారా..? లేదా..? అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More