అల్ ఖైదా రెండో నాయకుడిగా చెప్పుకుంటున్న అబ్దుల్లా అహ్మద్ హతమైనట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించారని అమెరికాకు చెందిన కొన్ని పత్రికలు ప్రచురించాయి. 1998 లో అమెరికన్ రాయభార కార్యాలయాలపై జరిగిన దాడుల్లో అబ్దుల్లా అహ్మద్ ఒకరుగా ఉన్నారు. గత ఆగస్టు 7వ తేదీన టెహ్రాన్ వీధుల్లోకి వచ్చిన అబ్దుల్ అహ్మద్ నుఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కాల్పి చంపారన్నారు. అలాగే ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్ సతీమణి మిరియంతోపాటు అతని కుమార్తె కూడా హత్యకు గురైనట్లు అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. కాగా అమెరికా ఆదేశాల మేరకే ఇజ్రాయెల్ కు చెందిన వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపనలు వస్తున్నా.. అమెరికా ఏ విధంగా స్పందించలేదు.