spot_img
Homeజాతీయ వార్తలుWhatsApp: భారత్‌ను వీడతానంటున్న వాట్సాప్‌.. కారణం అదే?

WhatsApp: భారత్‌ను వీడతానంటున్న వాట్సాప్‌.. కారణం అదే?

WhatsApp: మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్‌ భారత్‌ను వీడుతామంటోంది. కొత్త ఐటీ నిబంధనలతో పనిచేయలేమని చెబుతోంది. ఈమేరు ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఐటీ చట్టం ప్రకారం పనిచేయాలంటే కష్టమని తెలిపింది. తప్పనిసరిగా పాటించలంటే భారత్‌ను వీడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేస్తున్నామని ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తున్నందుకే యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది.

కొత్త చట్టంలో ఏముంది..
భారత ప్రభుత్వం 2021లో కొత్త ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టంలో మెసేజింగ్‌ యాప్‌ చాట్‌లను ట్రేస్‌ చేసేలా సవరణ చేశారు. వాటిని మొదటగా ఎవరు పంపించారో గుర్తించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను వాట్సప్‌ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టుకు వాట్సాప్‌ తరఫున న్యాయవాది కరియా తన వాదనలు వినిపించారు. కొత్త ఐటీ నిబంధనలు పాటించేలా వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లేలా ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే వాట్సప్‌ ఇండియా నుంచి వైదొలుగుతుందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం యూజర్లు పంపుతున్న మెసేజ్‌ల్లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్ట్‌ విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా కొన్నిమెసేజ్‌లు వైరల్‌ అవుతుంటాయి. వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియేజేసేలా ఐటీ నిబంధనలున్నాయి.

డీక్రిప్ట్‌ చేయాలి..
వైరల్‌ అవుతున్న మెసేజ్‌లతోపాటు వ్యక్తిగతంగా, గ్రూప్‌లో షేర్‌ చేస్తున్న మెసేజ్‌ల మూలకర్తలను గుర్తించాలంటే వాటిని డీక్రిప్ట్‌ చేయాల్సి ఉంటుంది. లక్షల సందేశాలను ఏళ్లపాటు డేటాబేస్‌లో అట్టేపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని కరియా కోర్టుకు తెలిపారు.

కొన్ని కేసుల్లో మెస్సేజ్‌లే కీలకం..
ఇదిలావుండగా, మతపరమైన హింస వంటి కొన్ని కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన కంటెంట్‌ ప్రసారం అవుతున్నపుడు ప్రభుత్వ నియమం చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్రం తరఫు న్యాయవాది అన్నారు. అందుకోసమే ఐటీ చట్టంలో నిబంధన చేర్చినట్లు వెల్లడించారు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. ఐటీ నిబంధనల్లో పలు అంశాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని ఇతర పిటిషన్ల విచారణను ఆగస్టు 14కు షెడ్యుల్‌ చేయాలని బెంచ్‌ ఆదేశించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper