spot_img
Homeజాతీయ వార్తలుIndia Rice Export Ban 2023: బియ్యం ఎగుమతులపై నిషేధానికి ప్రధాన కారణం ఇదే..

India Rice Export Ban 2023: బియ్యం ఎగుమతులపై నిషేధానికి ప్రధాన కారణం ఇదే..

India Rice Export Ban 2023: వరి పండించే దేశాల్లో భారత్ ప్రధానంగా ఉంటుంది. మిగతా దేశాల్లో కంటే ఇక్కడ పండించే వరికి డిమాండ్ ఎక్కువ. అందుకే భారత్ వివిధ దేశాలకు వడ్లను బియ్యంగా మార్చి ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ మనవాళ్లు ఉన్నా అన్నంను తినగలుగుతారు. అందువల్ల అక్కడివారి కోసమైనా బియ్యాన్ని నిత్యం ఎగుమతి చేస్తుంటారు. అయితే భారత్ ఇటీవల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. కొన్నాళ్ల పాటు సోనా మైసూర్ లాంటి బియ్యాన్ని ఎగుమతి చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో అన్నం తినేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బియ్యం కోసం క్యూ కట్టిన సీన్ బయటకొచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అసలు దేశంలో బియ్యం కొరత ఎందుకు ఏర్పడింది? అనే విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది.

భారత్ లో ప్రధాన పంట వరి. దేశంలోని 70 నుంచి 80 శాతం మంది అన్నంనే ఎక్కువ తింటారు. అయితే రకరకాల పంటలను వేయడం ద్వారా ఆయా ప్రాంతాల వారు వారి రుచులకు అనుగుణంగా బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో నాసిరకమైనా తినగలుగుతారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సోనా మసూరి మాత్రమే తినగలుగుతారు. తాజాగా సోనా మసూరి బియ్యం తీవ్ర కొరత ఏర్పడింది. దేశంలో ఉన్న వీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని వారికంటే దేశంలోని వారికి ధాన్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.

ఈ ఏడాది జూన్ మాసంలో సౌత్ లో చినుకు కనిపించలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసాయి. ఢిల్లీతో పాటు ఛత్తీస్ గడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు పొంగి ప్రవహించాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.కొందరు రైతులు రెండో క్రాప్ వేసే సమయంలో ఈ వర్షాలు రావడంతో వారు పంటలను ఆలస్యంగా వేశారు. మన దేశంలో వరిని ఛత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తారు. ఆ తరువాతి స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. అయితే ఆంధ్రాలోనూ ఈసారి పంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వచ్చే పంటలు ఆలస్యంగా చేతికి వస్తాయి.

దీంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఉన్న నిల్వలను కాపాడుకునేందుకు ఎగుమతులను నిలిపివేసింది. ఇప్పటికే టమాట పండించే రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వాటి ధరలు కొండెక్కాయి. ఇప్పుడు బియ్యం విషయంలో అదే జరిగితే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయి. అందువల్ల ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అయితే ఇది శాశ్వతం కాదని, వచ్చే పంట తరువాత యథాస్థితికి వస్తుందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper