Homeజాతీయ వార్తలుAP Cabinet Expansion: జగన్ కొత్త కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు?

AP Cabinet Expansion: జగన్ కొత్త కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు?

AP Cabinet Expansion: ఏపీ సీఎం జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఈ కేబినెట్ ను రద్దు చేసి కొత్త మంత్రులను తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులను తప్పించడం.. కొత్త మంత్రులకు అవకాశం గురించి అనేక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

AP Cabinet Expansion
JAGAN

2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తన కేబినెట్ కూర్పుతో అందరికీ షాకిచ్చాడు. అగ్రవర్ణాలు, పార్టీ కోసం ఎంతో కృషి చేసిన సీనియర్లను పక్కనపెట్టి సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేశారు. ముక్కు మొహం తెలియని వారిని.. తొలి సారి గెలిచిన అనుభవం లేని వారిని కూడా వారి సామాజిక కులం ఆధారంగా మంత్రిపదవులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా వెనుకబడి ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అందులో ఒకటి బీసీలకు ఇవ్వగా.. మరొకటి కాపు వర్గానికి కేటాయించారు.

Also Read: KTR Tweets On Gujarat Power Cut: గుజార‌త్‌లో ప‌వ‌ర్ క‌ట్‌.. ఆటాడేసుకుంటున్న కేటీఆర్‌.. టైమింగ్ అంటే ఇదేనేమో..

జగన్ సీఎం అయిన తర్వాత తన కేబినెట్ లో ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఇక ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా డిప్యూటీ సీఎం పదవులు ఆరుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న వర్గాలతో పాటు అదనంగా మరో ఇద్దరికీ అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.

ఈసారి జగన్ కొత్త కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కొనసాగనుంది. ఇక బీసీల్లో తొలుత జగన్ శెట్టి బలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయన రాజ్యసభకు వెళ్లడంతో ఆ కోటాలో ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఈసారి బీసీ వర్గాల్లో మత్స్యకార వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం.

ఈక్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మత్స్యకార వర్గం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు ఇప్పుడు మంత్రి పదవి ఖాయం అన్న ప్రచారం సాగుతోంది. ఇక వీళ్లే కాదు ఈసారి వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు సైతం డిప్యూటీ సీఎం హోదా ఇచ్చేందుకు జగన్ రెడీ అయినట్టు తెలుస్తోంది. వైశ్య సామాజికవర్గం నుంచి కొలగొట్ల వీరభద్ర స్వామి లేదా అన్నా రాంబాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బ్రాహ్మణుల కోటాలో మల్లాది విష్ణు, కోన రఘుపతిలలో ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కోన రఘుపతికి మంత్రి పదవి ఇస్తానని జగన్ గతంలో హామీ కూడా ఇచ్చారు.

AP Cabinet Expansion
AP Cabinet Expansion

ఇక సామాజిక కోణంలో జగన్ కొంతమంది మంత్రులను ఉంచి మరికొంత మందినీ తీసేస్తాననడంతో మిగిలిన వారు భగ్గుమంటున్నారు. తీసేస్తే అందరినీ తీసేసి వందశాతం కొత్త వారిని తీసుకోవాలని అంటున్నారు. పలువురు సీనియర్ మంత్రులదీ అదే మాట.. దీంతో జగన్ ఎవరిని తొలగిస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏడో తేదీన చివర కేబినెట్ మీటింగ్ పెట్టి అందరి రాజీనామా పత్రాలు తీసుకొని గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. తర్వాత కొత్త మంత్రులెవరో 10వ తేదీన వారికి సమాచారం ఇస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త పాత మంత్రులకు జగన్ విందు ఏర్పాటు చేసి కూల్ చేస్తారని..బుజ్జగించి పార్టీ కోసం పనిచేయాలని సూచిస్తారని తెలుస్తోంది. పార్టీలో అసమ్మతి సెగ రాకుండా ముందస్తుగా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దింపినట్టు సమాచారం.

ఇక 2024 ఎన్నికల లక్ష్యంగా ఈసారి సీఎం జగన్ కొత్త కేబినెట్ ఉంటుందని.. దూకుడుకు మారుపేరుగా ఉండే సీనియర్ నేతలు రోజా, ధర్మాన ప్రసాద్ రావు, అంబటి రాంబాబు ,భూమన లాంటి మరికొంత మంది ఫైర్ బ్రాండ్స్ కు జగన్ ఈసారి కేబినెట్ లో చోటు కల్పించి మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం సాగుతోంది. వీళ్లు ఉంటే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతారని.. ప్రచారంలోనూ కలిసి వస్తారని జగన్ భావిస్తున్నారు. జగన్ మార్క్ లెక్కలు, ప్రక్షాళనతో ఈసారి ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

Also Read: Chiranjeevi Comments On Taapsee: రాజ‌కీయాల కంటే హీరోయిన్లు ఎక్కువ‌య్యారా చిరు.. ఏంటీ కామెంట్లు..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] AP Cabinet Expansion: ఏపీ సీఎం జగన్ కు ఏప్రిల్ గండం పొంచి ఉంది. గత మూడేళ్లుగా తిరుగులేని ఆధిపత్యంతో వ్యవహరిస్తూ వచ్చిన ఆయనకు రాబోయే పరిణామాలు తలబొప్పి కట్టించనున్నాయి. తిరుగులేని సంఖ్యాబలంతో నేనేమి చేసినా చెల్లుబాటవుతుందని ఆయన పాలన సాగించారు. ఇక అలా చేస్తే కుదిరే పనిగా కనిపించడం లేదు. మంత్రివర్గ విస్తరణ ద్వారా తెనె తుట్టను కదిలించిన ఆయన అసమ్మతి పోటు తప్పేలా లేదు. అత్యంత సన్నిహితులు, అనుచరులుగా ఉన్న కొంతమంది సీనియర్లు తిరుగుబావుట ఎగుర వేసే ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెంట నడిచిన కొంత మంది నాయకులు పార్టీలో మెరుగైన అవకాశాలు దక్కక పక్క చూపులు చూస్తున్నారు. గ్రామస్థాయి కేడర్ సైతం వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. […]

  2. […] AP High Court: చేతిలో అధికారముంది కదా అని ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే కుదరదు. ప్రభుత్వ పెద్దలు చెప్పారనో.. వారి ప్రాపం కోసమో..వారి అడుగులకు మడుగులొత్తి ప్రజాధనం దుర్వినియోగం చేస్తామంటే అధికారులు కోర్టు బోనులో నిలవాల్సిందే. మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రజాధనం ఖర్చు విషయంలో కోర్టు తీర్పును బేఖాతరు చేసి.. న్యాయస్థానాన్ని ధిక్కరించిన ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పు అధికార గణానికి గట్టి హెచ్చరికగా మిగిలిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. దేశంలో బ్యూరోక్రసి వ్యవస్థ ఔన్నత్యాన్ని గుర్తుచేస్తూ న్యాయస్థానం ఇచ్చిన విలక్షణమైన తీర్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పంచాయతీల స్థానంలో గ్రామాల్లో కొత్తగా సచివాలయ భవనాలను నిర్మించారు. కానీ చాలా చోట్ల కనీస నిబంధనలు పాటించలేదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular