Homeఆంధ్రప్రదేశ్‌గొప్పల బాబు...మారేదెప్పుడు?

గొప్పల బాబు…మారేదెప్పుడు?

దేశంలోని ఏ రాజకీయనాయకుడిలో లేని స్వభావం బాబులో ఒకటుంది. అదే ఆత్మ స్తుతి..తనని తానే వీరలెవల్లో పొగుడుకోవడం బాబుకు బాగా నచ్చిన వ్యవహారం. ఏదైనా ఒక విజయం, ఫలితంలో క్రెడిట్ బాబు ఎవరికీ పంచరు.ఏదైనా నా వలనే అంటారు. మనం అనే పదం ఆయన నోటి నుండి రాదు. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతగా ఆయన ఫీలవ్వరు. అధికారం దక్కిన వెంటనే ప్రజా సేవకుడని మరచిపోయి…తాను దేవుడు నియమించిన ఓ రాజుగా భావిస్తాడు. ప్రజాస్వామిక దేశంలో ఏ పాలకుడు మాత్రం ‘నేను ఇస్తున్న పెన్షన్స్ తీసుకుంటున్నారు, నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు.. నాకు ఓటు వేయరా’ అని అంటాడు చెప్పంది. ఆ మాటలతోనే అర్థం అవుతుంది బాబు పదవిలో ఉంటే ఆయనకొక అతీత శక్తిగా భావిస్తారని. ప్రజల సొమ్ముతో చేసే సంక్షేమ పథకాలను తన సొమ్ముతో చేస్తున్నట్లుగా చెప్పుకుంటూ, ఓటు వేయాలని బెదిరించిన ఏకైక ముఖ్యమంత్రి.

బాబుకు సైతం ఆ నేతలు దొరకడం లేదుగా?

సభావేదిక సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు నేను పనులు చేయనని చెప్పి, ప్రజా స్వామ్యంలో ప్రజల తీర్పుకు ఎంత గౌరవం ఇస్తాడో నిరూపించాడు. అధికారంలో ఉండగా అరచేతిలో వైకుంఠం చూపించిన బాబు, ప్రతిపక్షంలోకి వచ్చాక కొత్త రాగం అందుకున్నారు. రాష్ట్రానికి ఎలాంటి విపత్తు దాపురించినా జగన్ ఫెయిల్ అయ్యాడని..’అదే నేనుంటేనా’ అంటున్నాడు. మీరు ఉన్నప్పుడు ఏమి చేయలేదనే కదా ప్రజలు మిమ్ముల్ని ప్రతిపక్షానికి పరిమితం చేసింది. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం చేసి ఉంటే…ప్రజలు మిమ్మల్ని 23సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు చెప్పండి.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

నేతలు చెప్పే గొప్పలు విని ఓట్లు వేసే రోజులు పోయాయి. ఏదైనా చేతల్లో చూపిస్తేనే నెక్స్ట్ అధికారం లేదంటే…పీఠం దిగాల్సిందే. బాబుకు మాత్రం ఇంకా ఆ హిపోక్రసి వీడడం లేదు. ఇంకా తానే ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారు. కరోనా కట్టడిలో దేశం మొత్తం జగన్ భేష్ అంటుంది. విపరీతంగా విజృంభిస్తున్న కరోనా కట్టడి విషయంలో జగన్ చాలా వరకు విజయం సాధించారు. ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు చేతులెత్తేశాయి. జగన్ వేలల్లో కరోనా టెస్ట్ లు నిర్వహిస్తూ నియంత్రిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా చికిత్స తీసుకొని బయట పడిన వారికి రూ. 2000 ఆర్థిక సాయం చేస్తున్నారు. నేటి నుండి వైరస్ కారణంగా మరణించిన వారి అంత్యక్రియల కోసం రూ. 15000 అందించనున్నారు. మొబైల్ కరోనా టెస్టుల కోసం 50కి పైగా బస్సులను సిద్ధం చేశారు. కరోనా కట్టడిలో బాబు ఇంతకు మించి ఏమి చేయగలడో సెలవిస్తే…బాగుంటుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Cockroach Janata Party Funding : కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్.. “లెక్క” భారీగానే ఉందిగా..

Cockroach Janata Party Funding : కావలసినంత ఆహారం వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఊహించని విధంగా వచ్చాయి. మెడికల్ కిట్లు.. ఫాస్ట్ ఫుడ్.. డ్రింక్స్.. టెంట్లు.. రాళ్లు.. రప్పలు.. ఇవన్నీ ఆకాశరామన్న పంపించినట్టు...

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
Oktelugu Epaper