Homeజాతీయ వార్తలుFinancial Crisis Telangana: తెలంగాణలో ఆర్థిక సంక్షోభం.. జీతాలకూ కష్టమే.. నెల గడవాలంటే ఎన్ని వేల...

Financial Crisis Telangana: తెలంగాణలో ఆర్థిక సంక్షోభం.. జీతాలకూ కష్టమే.. నెల గడవాలంటే ఎన్ని వేల కోట్లు కావాలంటే?

Financial Crisis Telangana: జాతీయ రాజకీయాలంటూ మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్న కేసీఆర్ మెడలు వంచేలా కేంద్రం చక్రం తిప్పుతోంది. కేంద్రం, ఆర్బీఐ నుంచి అప్పు పుట్టకుండా చేస్తోందన్న విమర్శలు టీఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది. మొన్నీ మధ్యనే ఢిల్లీ వెళ్లిన తెలంగాణ అధికారులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట కేంద్రంలోని మంత్రులు, అధికారులు. దీంతో తిరుగుముఖం పట్టిన కేసీఆర్ ఇప్పుడు జూన్ నెలను ఎలా వెళ్లదీస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది.

Financial Crisis Telangana
KCR

తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా తర్వాత అతలాకుతలమైన రాష్ట్ర సర్కార్ కు ప్రతీ నెల ఒక గండంలా గడుస్తోంది. క్లిష్టమైన ఈ జూన్ నెలను కేసీఆర్ సర్కార్ ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారింది. జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలు, రైతు బంధుకు డబ్బులు వేయడం కేసీఆర్ సర్కార్ తలకు మించిన భారంగా మారింది. నిధుల సేకరణ కానకష్టంగా మారడంతో ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్ లోనే సుమారు రూ.20వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండడంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.

Also Read: Caste Politics In Telugu States: ఏపీలో కమ్మ, రెడ్లు.. తెలంగాణలో వెలమ, రెడ్లు.. వేరే నేతలే లేరా?

జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలకే సుమారు రూ.10వేల కోట్లు అవసరం అవుతాయి. దీంతోపాటు వానాకాలం పంటకు ఇచ్చే రైతుబంధు కోసం రూ.7600 కోట్లు అవసరం అవుతాయని సమాచారం. మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల చెల్లింపు చాలా ఆలస్యమైంది. దీంతో ఈనెల అసలు చెల్లించడమే కష్టం అంటున్నారు.

ఇక తెలంగాణకు వచ్చే ఆదాయం రోజురోజుకు భారీగా తగ్గుతోంది. ప్రధానంగా పన్నులు, పన్నేతర రాబడి ద్వారా మే నెలలో రూ.10వేల కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. వ్యయం మాత్రం దాదాపు రూ.20వేల కోట్లకు పైగానే ఉంది.

Financial Crisis Telangana
govt employees in telangana

ఇక బాండ్ల విక్రయం ద్వారా రూ.4వేల కోట్లు సమీకరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నా కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటివరకూ కేవలం రూ.270 కోట్లకు మించి సమీకరించలేకపోయింది. దీంతో ఈనెల వేతనాలు, పింఛన్ల చెల్లింపులో తీవ్ర ఆలస్యం అయ్యేలా ఉంది. అదే జరిగితే కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లోనూ ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలానే పాలిస్తే అసలు కేసీఆర్ సర్కార్ పై విశ్వసనీయతే పోయే అవకాశం ఉంది.

కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా జాతీయ రాజకీయాలంటూ హంగామా చేస్తున్న కేసీఆర్ ను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అప్పుపుట్టకుండా చేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా పక్కా ప్లాన్ తో వెళుతోంది. సంక్షేమ పథకాలకు వేల కోట్లు పెట్టి ఇప్పుడు తెలంగాణను ఏపీ కంటే కూడా అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read:Mallareddy: అద్భుత విద్యావేత్త మల్లారెడ్డికి అర్జెంటుగా విద్యా శాఖ అప్పగిస్తే ఏమవుతుంది?

Recommended Videos:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular