Homeఆంధ్రప్రదేశ్‌బీజేపీలో టీడీపీ కోవర్టులు..?

బీజేపీలో టీడీపీ కోవర్టులు..?

టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న […]

TDP-BJP

టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటాయి. బీజేపీలో చేరిన టీడీపీ విధేయులు ఇప్పటికీ టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించడానికి కృషి చేస్తూనే ఉన్నారన్న ప్రచారం ఉంది. తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కేసులోనూ చంద్రబాబుపై ప్రేమ బీజేపీ లో ఉన్న ఆయన కోవర్టుల ద్వారా బయటపడింది.

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ వివాదాస్పద నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు.

అయితే అదే కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరిస్తోంది. బీజేపీ నేతగా ఉన్న కామినేని వైసీపీని బీజేపీ హైకమాండ్ వ్యతిరేకిస్తుందనే అభిప్రాయాన్ని హైకోర్టుకు ఎక్కడం ద్వారా వ్యాపింపచేశాడు. టీడీపీ చేయాల్సిన పనిని ఈ బీజేపీ నేత చేయడం.. హైకోర్టుకు ఎక్కడంతో ఈయన చంద్రబాబు కోవర్టా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీతో బీజేపీ జాతీయ నాయకత్వం సన్నిహితంగా మెలుగుతోంది. మంచి సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే ఒక సీనియర్ వైసీపీ ఎంపీ బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహితంగా ఉంటారు. అయినప్పటికీ కొంతమంది బీజేపీ నాయకులు ఇప్పటికీ టీడీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీలో చంద్రబాబు కోవర్టులున్నారని.. ఆయన కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రమేశ్ కుమార్ పై బీజేపీ నేత హైకోర్టుకు ఎక్కడంతో ఆ విషయం నిరూపితమైంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper