దేశంలో కరోనా నియంత్రణ కోసం పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు సహాయ నిధులకు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా వ్యాపార వేత్త రతన్ టాటా ముందుకు వచ్చారు. కరొనాను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా రూ.500 కోట్ల రూపాయలు సహాయం అందించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా రతన్ టాటా ట్వీట్ చేశారు. అందులో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర వనరులను సమకూర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గతంలో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మేము అండగా నిలిచాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ గతంలో కన్నా ఎక్కువగా మద్దతుగా నిలవాల్సి ఉందని రతన్ టాటా ట్వీట్ చేశారు. ఈ నిధులను వైద్యులకు అవసరమైన పీపీఈలు, కరోనా కేసులు పెరిగితే చికిత్స కోసం వినియోగించే శ్వాససంబంధ పరికరాలు, టెస్టింగ్ కిట్ల కొనుగోలు, హెల్త్ వర్కర్ల శిక్షణ కోసం ఉపయోగిస్తామన్నారు.
ఇండియాలో ఇప్పటి వరకు 933 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఇండియా రెండో స్టేజ్ లో ఉన్నది. మూడో స్టేజ్ లోకి వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. ఎలాగైనా సరే వైరస్ కు చెక్ పెట్టె దిశగా ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Tata trust makes a huge donation to control corona virus
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com