Homeజాతీయ వార్తలుSilver Price : రికార్డుల మోతమోగిస్తున్న వెండి..దీపావళి నాటికి రూ.1.30లక్షలు దాటేనా ?

Silver Price : రికార్డుల మోతమోగిస్తున్న వెండి..దీపావళి నాటికి రూ.1.30లక్షలు దాటేనా ?

Silver Price : వెండి ధరలు ఇటీవల కాలంలో పెట్టుబడిదారులను ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకూ రికార్డులను తిరగరాస్తున్న వెండి ధరలు (Silver Prices) ఇప్పుడు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ దీపావళి నాటికి వెండి ధరలు కిలోకు రూ.1.30 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈ అంచనా కేవలం ఇన్వెస్టర్లకే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఒక పెద్ద సంకేతం. మరి వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.

కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా ప్రకారం.. దీపావళి నాటికి వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధర కిలోకు రూ.1.25 లక్షల నుండి రూ.1.30 లక్షల వరకు వెళ్లవచ్చని ఆయన అంచనా వేశారు. దీనికి అతి పెద్ద కారణం ప్రపంచ మార్కెట్‌లో సాంకేతిక బ్రేకౌట్ అని ఆయన తెలిపారు. ఇటీవల వెండి అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 37 డాలర్ల స్థాయిని తాకింది. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల పారిశ్రామిక డిమాండ్ పెరిగింది. వెండి దాదాపు 53-56శాతం వరకు పారిశ్రామిక రంగాల్లో ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, 5G టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిల్లో దీనికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

అజయ్ కేడియా చెప్పినట్లుగా.. ప్రస్తుతం గోల్డ్-సిల్వర్ నిష్పత్తి 91 దగ్గర ఉంది. దీని అర్థం ఏంటంటే.. బంగారంతో పోలిస్తే వెండి ఇంకా పెట్టుబడికి ఆకర్షణీయంగా ఉంది. చరిత్రలో ఈ నిష్పత్తి 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అది తగ్గినప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగేవి. సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం.. వెండి సరఫరాలో కొరత, డిమాండ్ పెరుగుదల కారణంగా.. ఇది వరుసగా ఐదవ సంవత్సరం కూడా లోటులో ఉంది. ఈ లోటు ధరలను మరింత పెంచుతోంది.

Also Read : రాబోయే కాలంలో వెండే కీలకం.. బిజినెస్ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..

వెండిలో పెట్టుబడులను పెంచడంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పాత్ర చాలా కీలకమైనది. గతంలో ధనతేరస్ లేదా అక్షయ తృతీయ వంటి పండుగలకు మాత్రమే వెండిని కొనేవారు. కానీ ఇప్పుడు ప్రజలు దీనిని ఒక పెట్టుబడి ఎంపికగా చూస్తున్నారు. డిజిటల్ వెండి, ఈటీఎఫ్‌ల ద్వారా చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా మల్టీ-అసెట్ ఫండ్స్‌లో వెండిని చేర్చడం ప్రారంభించాయి. దీనివల్ల దీని ప్రజాదరణ మరింత పెరిగింది.

కేడియా అంచనా ప్రకారం.. వెండి ధరలు ఈ సంవత్సరం చివరి నాటికి ముఖ్యంగా దీపావళి నాటికి రూ. 1.30 లక్షలకు చేరుకోవచ్చు. గత 60 రోజుల్లో వెండి 24శాతం రాబడిని ఇచ్చింది. ఇది ఇతర పెట్టుబడి ఎంపికల కంటే చాలా ఎక్కువ. పారిశ్రామిక డిమాండ్, సరఫరాలో కొరత, పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుదల కారణంగా వెండి ఈ జోరు కొనసాగించే అవకాశం ఉంది.బంగారంతో పోలిస్తే వెండిని రాబడి కోసం ఒక మంచి ఎంపికగా పరిగణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లాంగ్ టర్మ్ పెట్టుబడికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ దీపావళికి మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే వెండిపై ఒక కన్ను వేసి ఉంచండి. వెండి ధరలు తమ రికార్డులను బద్దలు కొట్టి, కొత్త రికార్డులను సృష్టించవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular