Homeజాతీయ వార్తలుWater Scarcity Crisis: కమ్ముకొస్తున్న కనీవినీ ఎరుగని కరువు.. ఆ 200 జిల్లాలలో అల్లకల్లోలమే

Water Scarcity Crisis: కమ్ముకొస్తున్న కనీవినీ ఎరుగని కరువు.. ఆ 200 జిల్లాలలో అల్లకల్లోలమే

Water Scarcity Crisis: మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని.. ఎల్ నీనో ప్రభావం అంతగా ఉండదని మీడియాలో వార్తలు వచ్చాయి.. కానీ ఈ మురిపం రెండు మూడు రోజులకే పరిమితమైంది. ఎందుకంటే రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల మినహా మిగతా అన్నిచోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షపాతం ఏకంగా 36% లోటుకు చేరుకుంది. జూన్ నెలలో వర్షపాతం 36% లోటు పెద్ద ఇబ్బంది కాకపోయినప్పటికీ.. రుతుపవనాల విస్తరణకు ఏమాత్రం అనుకూల వాతావరణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జూన్ 16 నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఏకంగా 35 శాతానికి చేరుకుంది. మహారాష్ట్ర.. కొంకన్ తీరంలో ఇంతవరకు నైరుతీ రుతుపవనాలు విస్తరించలేదు. ఈ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడి వర్షాలు కురిస్తేనే గోదావరి నదికి వరద వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆ వరదే జీవనాధారం. పొడి వాతావరణం వల్ల కొన్ని రోజులుగా ఉత్తర దిశగా రుతుపవనాల విస్తరణ పూర్తిగా ఆగిపోయింది.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఈ సమయానికి వాయవ్య భారతదేశం మాత్రమే సాధారణ వర్షపాతం కంటే ఒక ఐదు శాతం ఎక్కువగా పొందింది. తూర్పు, ఈశాన్యం, మధ్య భారతదేశం, దక్షిణ దీపకల్పంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది.

ఈశాన్య భారతదేశంలో 43%.. మధ్య భారత దేశంలో 63%.. దక్షిణ ద్వీపకల్పంలో 14 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. 2000 నుంచి ఎల్ నీనో సంవత్సరాలను ఒకసారి పరిశీలిస్తే.. జూన్ వర్షపాత వ్యత్యాసాల విశ్లేషణలో 2015 జూన్ నెల నిలిచింది. ఆ సంవత్సరం జూన్ నెలలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం 14% అధికంగా నమోదయింది. 2002 జూన్.. 2024 జూన్ నెలలో వర్షపాతం సాధారణ స్థాయిగా నమోదయింది.. అనంతరం జూలై నుంచి మిగతా నెలలో వర్షపాతం తక్కువగా నమోదయింది.

2009లో జూన్ నెలలో సాధారణం కంటే 47% తక్కువగా వర్షపాతం నమోదయింది. 2014లో సాధారణం కంటే 44 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. 2023లో సాధారణం కంటే ఎనిమిది శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం కాలానుగుణంగా వేడిగా మారడం వల్ల అది భారత దేశంలో రుతు పవనాల గమనాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఎల్ నీనో సాధారణంగా రుతుపవనాల ప్రారంభం.. రుతుపవనాల ముగింపు పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని.. అందువల్లే ఈ స్థాయిలో వర్షపాతం తక్కువగా నమోదు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది కాస్త ఆలస్యంగా జూన్ 4న కేరళలో వృత్తిపవనాలు ప్రవేశించాయి. అయితే అప్పటికే పశ్చిమ తీరం వెంబడి రుతుపవనాల పురోగతి వేగాన్ని కోల్పోయింది. వాతావరణంలో మార్పుల ఆధారంగా రుతుపవనాలు విడతలవారీగా కదులుతూ ఉంటాయి. ముంబై శివారు ప్రాంతానికి చేరుకున్న మొదటి విడత రుతుపవనాలు స్థిరంగా నిలబడలేకపోయాయి. దీనికి బదులుగా ముంబై నగరానికి ఉత్తరాన ప్రతికూల వాతావరణం వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయి.. ఒకవేళ వర్షాలు కురవాలి అంటే కచ్చితంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాలి.. అప్పుడుగాని ఎల్ నీనో ప్రభావం తగ్గుతుంది.

ఇప్పటి అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 20 జిల్లాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని.. తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు మాత్రమే రైతులు వేసేలా అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది.. ఒకవేళ కరువు వల్ల పంటలు పండకపోతే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే చైనా ఎరువుల తయారీకి సంబంధించిన ముడి పదార్ధాలపై ఆంక్షలు విధించింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి వ్యయం కూడా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular