తెలంగాణ పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాదాపు ఖాయమైనట్టు సమాచారం. న్యూ ఢిల్లీ నుంచి వస్తున్న నివేదికల ప్రకారం.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) నూతన అధ్యక్షుడిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్టు తెలిసింది. .
ప్రస్తుతం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన రేవంత్.. సీనియర్ నాయకుడు నల్గొండ ఎంపీ కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో నియామకం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. పార్టీకి దూకుడు నాయకుడు అవసరమని.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేయగల రేవంత్ను పీసీసీ చీఫ్గా నియమించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
అనుభవజ్ఞులు.. యువ నాయకుల కలయికతో మొత్తం పీసీసీని సమర్థవంతంగా.. బలంగా మార్చడానికి రేవంత్ ను సోనియా నియమించినట్టు తెలిసింది. నివేదికల ప్రకారం, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ మంత్రి ఎండీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధు యష్కిలను పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తారని తెలిసింది.
ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ కు ప్రధాని పోటీదారు అయిన సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టిపిసిసి పదవిలోకి తీసుకోవడం లేదని తెలిసింది. కోమటిరెడ్డిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శులుగా నియమిస్తారని సమాచారం.
అదేవిధంగా, ఇప్పటివరకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ను ఏఐసిసి కార్యదర్శిగా నియమిస్తారని అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.