spot_img
Homeఅంతర్జాతీయంImran Khan: ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీం షాక్.. అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందే

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీం షాక్.. అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందే

Imran Khan: పాకిస్తాన్ లో పరిణామాలు మారుతున్నాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు తప్పేలా లేవు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ ను ఇరుకునపెట్టే విధంగా తీర్పు ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించడంతో ఇమ్రాన్ ఖాన్ కు గండం ఎదురు కానుందని తెలుస్తోంది.

Imran Khan
Imran Khan

అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ శక్తులున్నాయనే కోణంలో ఏప్రిల్ 3న చేపట్టే అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో ఇక ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఇమ్రాన్ కు పదవీ గండం తప్పనిసరి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను పదవీచ్యుతుడిని చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read: One Chance: ఒక్క ఛాన్స్.. ఏపీని ‘అంధకారం’ దిశగా తీసుకెళుతుందా?

మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్ ఇందులో విదేశీ శక్తుల హస్తం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఖాసిం సూరి కూడా వంత పాడారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ అవసరం లేదని రద్దు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇక అవిశ్వాసం పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది.

Imran Khan
Imran Khan

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సూచన మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి అసెంబ్లీని రద్దు చేశారు. మెజార్టీ కోల్పోయిన ఇమ్రాన్ కు నాలుగు రోజులైనా గడవకముందే సుప్రీంకోర్టు తీర్పు ఇరుకున పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కోర్టు లోపల బయట పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. పాక్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ కూడా ఓ కన్నేసింది. అదంతా వారి వ్యక్తిగత వ్యవహారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Also Read:Maarisetty Raghavaiah: జనసేన వ్యూహకర్త మారిశెట్టి రాఘవయ్య బీజేపీ లో చేరిక!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper