Homeజాతీయ వార్తలుKCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?

KCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?

KCR vs Governor: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య పొరపొచ్చాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వం తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ చెబుతుంటే రాజ్యాంగ బద్ధంగా కాకుండా ఏకపక్షంగా ఆమె వ్యవహారాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో కొద్ది రోజులుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలే అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం గవర్నర్ కు మధ్య రోజురోజుకు తీవ్ర స్థాయిలో విమర్శలే వస్తున్నాయి.

KCR vs Governor
owaisi, Governor

దీనిపై మరో పార్టీ కూడా జతకలిసి టీఆర్ఎస్ కు చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గవర్నర్ విషయంలో ఓ బాంబు పేల్చారు. రాజ్ భవన్ లో పీఆర్వోను బీజేపీకి చెందిన వ్యక్తిని ఎలా నియమించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దీంతోనే టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ను టార్గెట్ చేసుకుందని చెప్పడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ కు వంత పాడేందుకు ఓ అండ దొరికినట్లు అయింది. కానీ నిజానికి గవర్నర్ పై టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందని పలువురు వాదిస్తున్నారు.

Also Read: RRR OTT: ఓటీటీ రాక పై మరో ట్విస్ట్.. ఎప్పుడు ? ఎక్కడో తెలిస్తే షాకే !

వీరి వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా టీఆర్ఎస్ ను తప్పుబడుతున్నాయి. మహిళను అవమానించడం టీఆర్ఎస్ కు సబబుకాదని హితవు పలుకుతున్నాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు మొండిగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం. రామాయంపేట ఘటనలపై గవర్నర్ నివేదిక కోరగా దీనిపై టీఆర్ఎస్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే అధికార పార్టీకి గవర్నర్ కు మధ్య విభేదాలు పెరిగినట్లు సమాచారం.

KCR vs Governor
KCR vs Governor

టీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ వ్యవహారంలో ప్రతిపక్షాలు మాత్రం గవర్నర్ పక్షం వహిస్తున్నా ఎంఐఎం మాత్రం టీఆర్ఎస్ కు వంత పాడటంతో ఇక ఈ కథ ఎందాకా వెళ్తుందో అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన గవర్నర్ ను రాజకీయ పార్టీ లక్ష్యంగా చేసుకుని వివాదాల్లోకి లాగడం ఇదే తొలిసారి. బీజేపీ పై ఉన్న కోపంతో గవర్నర్ ను టార్గెట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వీరి పంచాయితీ ఎంత దకా వస్తుందో అని అందరు ఆలోచనలో పడ్డారు.

Also Read:Samantha Sweet Warning To Naga Chaitanya: నాగ చైతన్య కి సమంత స్వీట్ వార్నింగ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

4 COMMENTS

  1. […] Sai Ganesh Suicide Issue: అధికారం ఏమైనా చేయవచ్చు. కొండ మీది కోతిని కూడా ఆడించవచ్చు.అయితే అంతే స్థాయిలో ప్రతిపక్షం ఉంటే చాలా కష్టం. ఏపీలో వైసీపీకి టీడీపీలా.. ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ ధీటుగా నిలబడుతుంది. అస్సలు ఉనికి లేని జిల్లాల్లో సైతం యువకులతో కాక రేపుతోంది. గులాబీ పార్టీని బీజేపీ యువదళం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో చాలా మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బీజేపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపిన చరిత్ర బీజేపీది. అలాంటి జిల్లాలో ఆ పార్టీ నేతలను వదులుతుందా? వదలదు కదా? ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ తనను ఎదురించిన బీజేపీ కార్యకర్తపై గులాబీ శ్రేణులు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు అతడు ఆత్మహత్య చేసుకొని తన చావుకు ఓ మంత్రి కారణమని ఆరోపించారు. అదే ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. […]

  2. […] Viral Video: కామా తురాణం నభయం నలజ్జ కామంతో కళ్లు మూసుకుపోతే ఏదీ కనిపించదు. నిద్ర వచ్చిన వారికి మంచమేదో పరుపేదో తెలియదు. ఆకలితో ఉన్నవాడికి ఏది పెట్టినా పరమాన్నంగానే భావిస్తాడు. పూటకూళ్లమ్మ పుణ్యమెరగదు. నేటి కాలంలో కూడా మన దేశాన్ని గౌరవించడానికి కారణం మనదేశ సంస్కృతి, సంప్రదాయాలే. విదేశీయులు సైతం మన కట్టుబాట్లకు ఫిదా అయిపోతారు. అందుకే ఏ దేశం అమ్మాయి అయినా భారత దేశంలోని సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. ఇంతటి మహత్తర చరిత్ర కలిగిన దేశం నానాటికి దిగజారిపోతోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular