Homeజాతీయ వార్తలుChandrababu- Mamata Banerjee: చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?

Chandrababu- Mamata Banerjee: చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?

Chandrababu- Mamata Banerjee: దేశంలో పెగాసస్ వ్యవహారం సృష్టించిన వివాదం అందరికి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తూ కుట్రలు చేస్తోందని అప్పట్లో పార్లమెంట్ ను ఓ కుదుపు కుదిపేసిన పెగాసస్ విషయం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ బాంబు పేల్చారు. అసెంబ్లీ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెను దుమారం రేగేందుకు పరోక్షంగా కారణమవుతోంది.

Chandrababu- Mamata Banerjee
Chandrababu- Mamata Banerjee

మమతా బెనర్జీ వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. టీడీపీ పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని చెప్పారు. ఒకవేళ టీడీపీ ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు. దీదీ ఆరోపణల్లో వాస్తవం లేదని బుకాయించారు. ఏదో కావాలనే ఉద్దేశంతో టీడీపీపై బురదజల్లేందుకే ఇలా మాట్లాడుతున్నారని వాపోయారు. అనవసరంగా ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలని అప్పట్లో మా దగ్గరకు వచ్చినా మేం వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేక తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

Also Read: Akhilesh Yadav: అఖిలేష్ ఎన్నికల ఖర్చులను కేసీఆర్, జగన్ సర్జారట

మొత్తానికి దీదీ చేసిన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఎందుకు ఇలా వ్యవహరించారో కూడా అర్థం కావడం లేదు. నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ కొందరు బెంగాల్ పోలీసులను సంప్రదించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబు దీన్ని కొనుగోలు చేసినట్లు మమత వివరించడం గమనార్హం.

Chandrababu- Mamata Banerjee
Chandrababu- Mamata Banerjee

పెగాసస్ వ్యవహారంలో దీదీ రేపిన వివాదం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. టీడీపీ సైతం వారి ఆరోపణల్ని ఖండించింది. తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని చెప్పింది. దీంతో గొడవ అక్కడే ఆగిపోయినా ఇప్పుడు మమత పేల్చిన బాంబుతో మళ్లీ పెగాసస్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. దీంతో పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు.

Also Read: TDP- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫర్ పై టీడీపీ మౌనం.. అసలు కారణం ఇదేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] CM KCR- JOB Notification: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రావడం లేదు. కానీ ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇది ముందుస్తు ఎన్నికల వ్యూహమనే చాలా మంది అనుమాన పడుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌పై నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. వారు నోరు విప్పితే ఆ వ్యతిరేకత ఇంకా పెరిగే చాన్స్ ఉంది. దీంతోనే నోటిఫికేషన్ల అంశాన్ని ఎప్పటికప్పుడు నొక్కి చెబుతున్నారు టీఆర్ఎస్ లీడర్లు.. వాస్తవానికి సీఎం ప్రకటన అనంతరం యువత పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతోంది. సీఎం ఉద్యోగాల ప్రకటనను సైతం టీఆర్ఎస్ లీడర్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున్న నోటిఫికేషన్స్ వస్తున్నాయని, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని టైం వేస్ట్ చేసుకోవద్దంటూ సూచిస్తున్నారు. సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండి పుస్తకాలతో యుద్ధం చేయాలని సలహా ఇస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular