spot_img
Homeజాతీయ వార్తలుDelhi Liquor Scam- Kavitha: లిక్కర్ స్కాం: ఢిల్లీలో ఆ అరగంట నాటకీయ పరిణామాలు

Delhi Liquor Scam- Kavitha: లిక్కర్ స్కాం: ఢిల్లీలో ఆ అరగంట నాటకీయ పరిణామాలు

Delhi Liquor Scam- Kavitha
Delhi Liquor Scam- Kavitha

Delhi Liquor Scam- Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు పెద్ద హైడ్రామాకు తెర లేపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎడి ఆఫీసు, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర భారీగా కేంద్ర బలగాలు వ్యవహరించడంతో అసలు ఏం జరుగుతుందనేది అంతు పట్టకుండా ఉంది.

వాస్తవానికి ఇవాళ ఉదయం 11:30 నిమిషాలకు కవిత విచారణకు హాజరు కావాలి. ఆమె మొన్ననే ఢిల్లీ వెళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇతర ఇంటలిజెన్స్ అధికారులు నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం 11:30 నిమిషాలకు కవిత విచారణ ఉన్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ ఉంటుందని భారత రాష్ట్ర సమితి నాయకులు అధికారికంగా ప్రకటించారు. అయితే 10 గంటలు దాటినప్పటికీ కవిత మీడియా ముందుకు రాలేదు. తర్వాత సరిగ్గా 11 గంటలకు ఈ డి ఆఫీస్ కి వెళ్లాల్సి ఉన్నా 11:30 దాటినా కవిత ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అరగంట పాటు కవిత నివాసంలో ఏం చేశారు? ఎవరెవరితో చర్చించారు? చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి గురువారం ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు మాట్లాడతారని అందరూ భావించారు. సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం, మొదటిసారి ఈ డి విచారణ వ్యవహారం.. అన్ని క్లారిటీగా మాట్లాడతారని భారత రాష్ట్ర సమితి శ్రేణులు భావించాయి. అది కూడా ఈడీ విచారణకు ముందు మీడియా మీట్ కావడంతో అందరిలోనూ సర్ ఆసక్తి నెలకొంది. కవిత నీవాసం నుంచి ఎప్పుడు బయటికి వస్తారా అని మీడియా ప్రతినిధులు వేచి చూశారు. కానీ ఆమె మీడియా ముందుకు రాలేదు. చివరికి మీడియా మీట్ రద్దయింది. దీంతో భారత రాష్ట్ర సమితి నిరాశకు గురయ్యాయి.

Delhi Liquor Scam- Kavitha
Delhi Liquor Scam- Kavitha

ఇక ఈడీ విచారణకు ఉదయం 11 గంటలకు బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కవిత ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ డి ఆఫీస్ నుంచి ఎస్కార్ట్ వాహనాలు కూడా కవిత ఉండే నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇక 11 గంటలైనా కవిత ఇంటి నుంచి బయటకు రాలేదు. చివరికి 11:30 నిమిషాలు దాటినా కూడా కవిత బయటి రాకపోవడం, అసలు విచారణకు హాజరవుతారా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీంతో 11 నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యలో కవిత ఏం చేశారు? ఎవరితో మాట్లాడారు అనే విషయాలను తెలుసుకునేందుకు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆసక్తి చూపించారు. మొదట మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కవిత చర్చించారని తెలుస్తోంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి అరగంట పాటు భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ ప్రతినిధులతో తీవ్రంగా చర్చించారు. అనంతరం అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. విచారణకు హాజరు కాలేనని న్యాయవాదుల ద్వారా ఈడికి కవిత సమాచారం పంపారు. భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈ సమాచారాన్ని కవిత ఈడికి చేరవేశారు. చివరికి ఎస్కార్ట్ వాహనాలు కవిత నివాసం నుంచి ఈ డి ఆఫీస్ కు వెను దిరిగాయి.

ఇక గురువారం నాడు ఈడి విచారణపై స్టే కావాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ పై ఈనెల 24న విచారణ చేపడతామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తో ఈ విషయాన్ని ఈ డి అధికారులకు తన న్యాయ ద్వారా పంపినట్టు తెలిసింది. తర్వాత అధికారికంగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈడి విచారణకు హాజరు కాలేనని కవిత తన న్యాయవాదుల ద్వారా తెలిపింది. ఆ తర్వాత తాను అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేనని, తనకు మరో తేదీ నిర్ణయించాలని కూడా న్యాయవాది ద్వారా కవిత కోరారు. అయితే కవిత విజ్ఞప్తిని ఈడి అధికారులు అంగీకరించలేదు. ఆఖరికి మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని కవిత నిర్ణయించుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మధ్యాహ్నం ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Oktelugu Epaper