spot_img
Homeజాతీయ వార్తలుPinaray Vijayan: పినరయ్ విజయన్ చేయగా లేనిది జగన్ చేయలేడా?

Pinaray Vijayan: పినరయ్ విజయన్ చేయగా లేనిది జగన్ చేయలేడా?

Pinaray VijayanPinaray Vijayan: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సైతం అమ్మేందుకు సిద్ధమైంది. దీంతో జగన్ పై కూడా మచ్చ పడనుంది. దీనికి సంబంధించిన చర్యలు ముమ్మరం చేసింది. కానీ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బలే తగలనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు కూడా వెనుకాడడం లేదు. కానీ కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ అక్కడి సంస్థను కాపాడుకోవడం చర్చనీయాంశం అయింది.

దేశంలో కమ్యూనిస్టుల కోటలు బీటలు వారాయి. పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ కాలం అధికారం చేపట్టిన కమ్యూనిస్టులు ప్రస్తుతం అన్ని కోల్పోయారు. ఒక్క కేరళలోనే పట్టు సాధించి అధికారం చేజిక్కించుకున్నారు. వారి విధానాలే వారిని అధికారానికి దూరం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ వారు పట్టుదలలో మూర్ఖులనే నానుడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేరళలో ప్రభుత్వాన్ని నడిపే పినరయ్ విజయన్ తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నారు. అందరి ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

కేరళను అటు కరోనా, ఇటు వరదలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ర్టంలో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజువారీగా ఇరవై నుంచి ముప్పైవేల పైనే కేసులు నమోదు కావడం తెలిసిందే. అయినా విజయన్ ఆందోళన చెందడం లేదు. దాని నివారణకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు చేసి మరీ పరిపాలన వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్న సందర్భంలో చాలా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దీన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో రాష్ర్ట ప్రభుత్వంపై కూడా అప్రదిష్ట పడనుంది. దీంతో జగన్ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. కానీ కేరళలో ఉన్న బీహెచ్ ఈఎల్ సంస్థను కూడా కేంద్రం ప్రైవేటీకరించాలని చేస్తున్న ప్రయత్నాలను తనదైన శైలిలో అడ్డుకున్నారు.

కేరళలోని కాసరగూడ జిల్లాలో ఉన్న బీహెచ్ ఈఎల్-ఈఎంఎల్ సంస్థను పినరయ్ విజయన్ రక్షించుకున్నారు. దీన్ని రాష్ర్ట ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కేంద్రం పన్నాగాలను పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో రూ.77 కోట్లు ఖర్చు చేసి మరీ దాన్ని కేంద్రం గుప్పిట్లోకి పోకుండా చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులకు బకాయి పడిన రూ.14 కోట్లు సైతం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి కంపెనీని కాపాడుకున్నారు. దీంతో విజయన్ చర్యను అందరు ప్రశంసిస్తున్నారు. అన్ని ప్రాంతాలు ఇలాగే చేసి సంస్థలను కాపాడుకోవాలని భావిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Oktelugu Epaper