spot_img
Homeజాతీయ వార్తలుJammu Kashmiri Pandits justice: జమ్ములో కశ్మీరి పండితులకు ఇన్ని రోజులకు జరిగిన న్యాయం

Jammu Kashmiri Pandits justice: జమ్ములో కశ్మీరి పండితులకు ఇన్ని రోజులకు జరిగిన న్యాయం

Jammu Kashmiri Pandits justice: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలులో ఉన్న కాలంలో కశ్మీరీ పండితులపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, నిర్బంధ గృహనిర్గమనం చరిత్రలో మరవలేని మచ్చ. ఆ సమయంలో వారి ఇళ్లు, భూములను స్థానిక నాయకులు, ఉగ్రవాదులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. కొందరు నామమాత్ర ధరలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ చీకటి చరిత్రకు తెరపడుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్‌ పండితులు వెనక్కి వస్తున్నారు. దీంతో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకుని కశ్మీరీ పండితులకు అప్పగించాలని నిర్ణయించింది. 3,500 ఎకరాల ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని, వాటిని త్వరలోనే నిజమైన యజమానులైన కశ్మీరీ పండితులకు అప్పగించనుంది.

చీకటి చరిత్ర..
1990లలో ఉగ్రవాదం ఉధృతమైనప్పుడు కశ్మీరీ పండితులు లోయను వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉగ్రవాదులు కశ్మీరీ పండితులను చంపేశారు, మహిళలపై అత్యాచారాలు చేశారు. భయంతో లక్షల మంది తమ స్వంత గడ్డను వదిలి పారిపోయారు. వారు వెళ్లిపోయాక, వారి ఇళ్లు, వ్యవసాయ భూములను స్థానికులు, ఉగ్రవాదులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఫారూఖ్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఒక చట్టం చేసి, కశ్మీరీ పండితుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. దీంతో, ఫారూఖ్‌ అబ్దుల్లా పార్టీ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) నాయకులే ఆ భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల ఆక్రమణ కేవలం ఆర్థిక లాభం కోసం కాదు.. రాజకీయంగా కశ్మీరీ పండితులను శాశ్వతంగా లోయ నుంచి తరిమికొట్టడానికి కుట్రగా కూడా మారింది.

న్యాయం జరుగుతోంది..
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్ర పరిపాలన ఈ అక్రమాలపై దృష్టి సారించింది. తాజాగా గణనీయమైన చర్యలు తీసుకుంది: కశ్మీర్‌ పరిపాలన మొత్తం 3,500 ఎకరాల ఆక్రమిత భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఒక్క సోపియాన్‌ జిల్లా నుంచే 240 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అనేక కశ్మీరీ పండితుల ఇళ్లు, వ్యవసాయ భూములు ఉగ్రవాదులు, స్థానిక నాయకుల ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూములను త్వరలోనే నిజమైన యజమానులైన కశ్మీరీ పండితులకు అప్పగించనున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, పత్రాల పరిశీలన పూర్తి చేశారు.

3,500 ఎకరాల భూముల స్వాధీనం కశ్మీర్‌ చరిత్రలో ఒక మైలురాయి. ఆర్టికల్‌ 370 కాలంలో జరిగిన అన్యాయాలకు న్యాయం జరుగుతోంది. కశ్మీరీ పండితులు తమ స్వంత గడ్డపై తిరిగి కాలు మోపే రోజు దగ్గరలో ఉంది. ఇది కేవలం భూమి తిరిగి ఇవ్వడం కాదు.. గాయపడిన ఆత్మలకు న్యాయం చేయడం, కశ్మీర్‌లో శాశ్వత శాంతికి పునాది వేయడం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Telugu Heroes

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...
Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Oktelugu Epaper