Homeఆంధ్రప్రదేశ్‌Janasena : జనసేన పార్టీ సమావేశంలో ఆమోదించిన సంచలన తీర్మానాలివీ

Janasena : జనసేన పార్టీ సమావేశంలో ఆమోదించిన సంచలన తీర్మానాలివీ

Janasena : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక సమావేశం ఏపీలోని మంగళగిరిలో జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసింది. అవేంటి? ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది తెలుసుకుందాం.

-అరాచక పాలనకు ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని జనసేన గళం వినిపస్తుంది.

-సామాన్యుల బాధలు తెలుసుకుంటూ వారిని ధైర్యాన్ని నింపేలా జనవాణి నిర్వహించాలి.

-విశాఖలో పవన్ కళ్యాణ్ అడ్డుకున్న వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించారు.

-ప్రభుత్వ వ్యవస్థలు దుర్వినియోగం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటం చేయాలని జనసేన తీర్మానం

-వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఖండిస్తూ బీజేపీ సీనియర్ నేతల మద్దతును జనసేన స్వాగతించింది. వారికి పవన్ సంఘీభావం తెలిపారు.

-తెలంగాణకు చెందిన నాయకులు, మేధావులు, ప్రతినిధుల నుంచి వైసీపీ ప్రభుత్వ చర్యలకు ఖండన.. జనసేనకు మద్దుతపై పవన్ సంఘీభావం తెలిపారు.

-విశాఖలో కేసుల్లో ఇరుక్కున్న జనసేన నేతలు, వీర మహిళలకు మనో ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

-విశాఖ అక్రమకేసుల్లో ఉన్న ప్రతీ కార్యకర్త, ప్రతీ నాయకుడు రక్షించుకొనే బాధ్యతను జనసేన తీసుకుంటుందని తీర్మానం చేశారు. అక్రమ కేసుల్లోని వారికి న్యాయపరమైన సహాయం చేయాలని జనసేన నిర్ణయించింది.

ఈ కీలక తీర్మానాలను జనసేన సిద్ధం చేసింది. వీటిని నిక్కచ్చిగా అమలు చేసి అధికార వైసీపీని ఇరుకునపెట్టాలని తీర్మానించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular