నేడు మొత్తం ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్ భారత్ లో మాత్రం ప్రభావం పరిమితంగా ఉండడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నట్లు తేలుతున్నది.
మిగిలిన దేశాలలో వలే మన దేశంలో విస్తృతంగా కరోనా పరీక్షలు జరపగా పోవడంతో పాటు జన్యుపరంగా ఇక్కడ చాల బలహీనంగా ఉండటం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానితో భారత్ లో వ్యాపించిన వైరస్ అంతగా ప్రమాదకారి కాదని భరోసా ఇస్తున్నారు.
వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వూహాన్ నగరంలో విస్తరించిన వైరస్తో పోల్చుకుంటే ఈ వైరస్ చాలా బలహీనంగా కనిపిస్తోందని తేల్చి చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో వూహాన్ నగరంలో కనుగొన్న వైరస్కు చుట్టూ కిరిటాల్లా ముళ్లు ఉన్నాయని, ఈ ముళ్లను బట్టే దానికి కరోనా అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
వూహాన్లో వెలుగు చూసిన తర్వాత మార్చినాటికి ఈ వైరస్ మూడు రకాలుగా మార్పు చెందినట్లు తమ పరిశోధనల్లో గుర్తించామని, అందుకే వీటికి ఏ, బీ, సీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. మొదటి రకం వైరస్ వూహాన్లో గుర్తించాక అది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు విస్తరించిందని చెప్పారు.
అక్కడ వైరస్ రెండు రకాల మార్పులకు లోనై ఐరోపా, అమెరికాలకు విస్తరించిందని తెలిపారు. ఐరోపా, అమెరికాలలో విస్తరించిన వైరస్ జన్యుపరంగా చాలా భిన్నంగా, బలంగా కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటితో పోల్చుకుంటే భారత్లో విస్తరిస్తున్న వైరస్ చాలా బలహీనంగా ఉందని తేల్చిచెప్పారు.