spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: ఏపీ రావణకాష్టంలా మారుతోందా?

Andhra Pradesh: ఏపీ రావణకాష్టంలా మారుతోందా?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహజ్వాలలు పెరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం రాష్ర్టంలో అలజడి పెరిగిపోయిందని ఫోకస్ పెంచుతోంది. ఒక మంచి పని చేసినపుడు కొన్ని విమర్శలు రావడం సహజమే. అంతమత్రాన అదేదో ఘోరం జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం సబబు కాదు. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్నది కూడా అదే. కొత్త జిల్లాల ఏర్పాటుతో చిత్తూరులో జరుగుతున్న గొడవలను టీడీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

Andhra Pradesh
Andhra Pradesh

జగన్ పాదయాత్ర సమయంలోనే జిల్లాలను పెంచుతానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ స్థానానికో జిల్లా చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. ఏ పని చేసినా విమర్శలు రావడం మామూలే. కానీ ఇందులో ప్రతిపక్షం పాత్ర ఉందనే విషయం వైసీపీ నేతలు చెబుతున్నారు.

పైగా టీడీపీ నేతల్లోనే హర్షం వ్యక్తమవుతోంది. తమ నేత చేయలేని పనిని జగన్ చేస్తున్నారని ముచ్చట పడిపోతున్నారు. 2014లో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చర్చకు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విమర్శలెందుకు తెచ్చుకోవడం అని పక్కన పెట్టేశారు. దీంతో ప్రస్తుతం జగన్ దీన్ని అమలు చేసి ప్రజల్లో పరపతి పెంచుకోవాలని చూస్తున్నారు. దీనికి చంద్రబాబు అడ్డు పుల్ల వేస్తున్నారని చెబుతున్నారు.

Also Read: Andhra Pradesh: ఏపీలో సమస్యలు వారికి గుర్తుకు రావడం లేదా?

ఎవరిని సంప్రదించకుండానే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని వాదిస్తున్నా మంచి పని చేయడానికి ముహూర్తం చూసుకోవాలా అనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో భిన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. జగన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని ప్రజలు అక్కడక్కడ విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు. అమరావతి రాజధానిగా చేసిన సమయంలో చంద్రబాబు ఎవరిని సంప్రదించారనే ప్రశ్నలు వస్తున్నాయి.

దీంతో సహజంగానే కొన్ని చోట్ల అభ్యంతరాలు వచ్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని తెలుస్తోంది. అయితే ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ప్రతిపక్షంలో తలెత్తుతున్నా దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జగన్ మరో ముందడుగు వేసినట్లు ప్రజల్లో సానుకూల దృక్పథం వ్యక్తమవుతోంది.

Also Read: Andhra Pradesh: ఎడిటర్స్ వర్షన్ : మొత్తం చేతులారా నాశనం చేసి.. ఇప్పుడు కొత్తగా అరుపులెందుకు..?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper