Homeజాతీయ వార్తలుIndian Army rescues mission: అర్ధరాత్రి అద్భుతం చేసిన ఇండియన్‌ ఆర్మీ.. సైనికుడి కోసం సాహసం

Indian Army rescues mission: అర్ధరాత్రి అద్భుతం చేసిన ఇండియన్‌ ఆర్మీ.. సైనికుడి కోసం సాహసం

Indian Army rescues mission: హెలిక్యాప్టర్లు చీకట్లో ఎగరలేవు. ఎందకంటే చీకట్లో పరిస్థితులు, వాతావరణం హెలిక్యాప్టర్ల ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. అందుకే ఎంత ప్రముఖులైనా చీకటి పడక ముందే ప్రయాణం చేస్తారు. చీకటి పడితే ప్రయాణం నిలిపవేస్తారు. కానీ జమ్మూ కశ్మీర్‌లో మన ఎయిర్‌ ఫోర్స్‌ అద్భుతం చేసింది. ఒక సైనికుడి ప్రాణాలు కాపాడేందుకు పైలెట్లు తమ ప్రాణాలు లెక్కచేయకుండా ఎవాక్యువేషన్‌ నిర్వహించారు. అస్వస్థతకు గురైన సైనికుడి కోసం.. జమ్మూ కశ్మీర్‌లోని కిస్తువాడు ప్రాంతం అత్యంత సవాళ్లతో […]

Indian Army rescues mission: హెలిక్యాప్టర్లు చీకట్లో ఎగరలేవు. ఎందకంటే చీకట్లో పరిస్థితులు, వాతావరణం హెలిక్యాప్టర్ల ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. అందుకే ఎంత ప్రముఖులైనా చీకటి పడక ముందే ప్రయాణం చేస్తారు. చీకటి పడితే ప్రయాణం నిలిపవేస్తారు. కానీ జమ్మూ కశ్మీర్‌లో మన ఎయిర్‌ ఫోర్స్‌ అద్భుతం చేసింది. ఒక సైనికుడి ప్రాణాలు కాపాడేందుకు పైలెట్లు తమ ప్రాణాలు లెక్కచేయకుండా ఎవాక్యువేషన్‌ నిర్వహించారు.

అస్వస్థతకు గురైన సైనికుడి కోసం..
జమ్మూ కశ్మీర్‌లోని కిస్తువాడు ప్రాంతం అత్యంత సవాళ్లతో కూడిన భూభాగం. ఇక్కడ గణకాలు, లోయలు, వంపులు, వేగవంతమైన నదీ ప్రవాహాలు ప్రతి క్షణం ప్రమాదాలను సృష్టిస్తాయి. ఇటీవల ఒక సైనికుడు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. అర్ధరాత్రి సమయంలోనే వైమానిక దళం చర్య తీసుకుంది. హెలికాప్టర్‌తో అతన్ని తక్షణం శ్రీనగర్‌ మెడికల్‌ కేంద్రానికి మార్చారు. ఇది సాధారణ రోజువారీ పని కాదు. ఇది సైనికుడి ప్రాణాల కోసం పోరాటం.

రాత్రి సవాళ్లను అధిగమించి..
రాత్రి వేళల్లో హెలికాప్టర్‌ పని అతి కష్టం. అజ్ఞాత భూభాగం, మార్పులు చెందే వాతావరణం, తక్కువ దృశ్యత పైలట్లను ప్రమాదాల్లోకి నెట్టుతాయి. కానీ భారత వైమానిక దళ పైలట్లు నైట్‌ విజన్‌ గాగుల్స్‌తో ఈ అడ్డంకులను దాటారు. ఈ సాంకేతిక పరికరాలు అంధకారంలో కూడా స్పష్టమైన దృశ్యాలు అందిస్తాయి. కచ్చితమైన నావిగేషన్‌ను సాధ్యం చేస్తాయి. ఫలితంగా, సైనికుడు సురక్షితంగా చేరి, చికిత్స పొంది కోలుకుంటున్నాడు. ఇది మెడికల్‌ ఎవాక్యుయేషన్‌లో కొత్త మైలురాయి.

ఈ ఎదుగుదల వైమానిక దళం శిక్షణ, సాంకేతిక అభివృద్ధి ఫలితం. గతంలో రాత్రి ఎవాక్యుయేషన్లు అరుదుగా జరిగేవి, కానీ ఎన్‌వీజీ, అధునాతన రాడార్‌ వ్యవస్థలు ఇప్పుడు సాధారణీకరిస్తున్నాయి. ఇది సైనికుల ప్రాణాలను కాపాడటంలో మాత్రమే కాక, అండోట్‌ ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందించే సామర్థ్యాన్ని పెంచుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper