India Defense System: భారత దేశం చుట్టూ శత్రుదేశాలే. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన శత్రువులు ఎవరు.. మిత్రులు ఎవరు అనేది తేలిపోయింది. పక్కలో బల్లాల్లా.. పాకిస్తాన్, చైనా మనపై కారాలు మిరియాలు నూరుతుంటాయి. వీటికి ఇప్పుడు బంగ్లాదేశ్ తోడైంది. నేపాల్ కూడా అప్పుడప్పుడు కవ్విస్తుంది. ఆపరేషన్ సిందూర్తో మన శక్తి ప్రపంచానికి తెలిసింది. కానీ మన దేశంపై అణుదాడి జరిగితే ఎదుర్కొనే వ్యవస్థ ఉందా.. ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది.
న్యూక్లియర్ దాడి జరిగితే పరిస్థితి ఏమిటి?
మన దేశంపై న్యూక్లియర్ దాడి జరిగితే దేశం మొత్తం మీద వినాశనం, రేడియేషన్ ప్రభావం, మౌలిక సదుపాయాల నాశనం వంటి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వ కేంద్రాలు, సైనిక స్థావరాలు, నగరాలు లక్ష్యంగా మారవచ్చు. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థలు దాడిని పూర్తిగా నివారించలేకపోయినా, నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. దాడి తర్వాత పునర్నిర్మాణం, సహాయక చర్యలు, అంతర్జాతీయ సహకారం కీలకం.
పాలనా వ్యవస్థ తుడిచిపెట్టుకుపోతే…
ప్రభుత్వ నాయకత్వం, కేంద్ర కార్యాలయాలు నాశనమైతే దేశం నిర్వాకం అవుతుంది. దీనికి రహస్య ప్రోటోకాల్స్ ఉంటాయి. సైనిక దళాలకు ముందుగా ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయి. సైన్యం, నేవీ, వాయుసేనల మధ్య సమన్వయం జరుగుతుంది. రహస్య వ్యవస్థలు, వారసత్వ నియమాలు ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్ ఎలాంటి నిర్దిష్ట వ్యవస్థను అనుసరిస్తుందో బహిరంగంగా తెలియదు, కానీ రెండవ దాడి సామర్థ్యం నిర్వహించడానికి రహస్య ఏర్పాట్లు ఉంటాయని అంచనా.
దాడులను తప్పించుకోవడానికి ఉన్న వ్యూహాలు..
భారత్ యొక్క ప్రధాన వ్యూహం నిరోధకత. శత్రువుకు ‘‘మనం నాశనమైనా, మేము తిరిగి దాడి చేస్తాం’’ అనే భయం కలిగించడం. ఇందుకు బాలిస్టిక్ మిస్సైళ్లు, జలాంతర్గాములు, విమానాలు వంటి వివిధ డెలివరీ సిస్టమ్స్ ఉపయోగపడతాయి. ముందస్తు దాడి కాకుండా, రెండవ దాడి సామర్థ్యం మీద దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ ఒప్పందాలు,
దౌత్యం కూడా ముఖ్యం…
శత్రువుల వద్ద ఉన్న ఆయుధాలుచైనా వద్ద బాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరం వెళ్లి, అధిక వేగంతో భూమిని చేరతాయి. హైపర్ సోనిక్ మిస్సైళ్లు వేగంగా వెళ్లినా, బరువు మోసే సామర్థ్యం తక్కువ. క్రూయిజ్ మిస్సైళ్లు, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ (చిన్న పరిమాణ న్యూక్లియర్ ఆయుధాలు) కూడా ఉన్నాయి. బాలిస్టిక్ మిస్సైళ్లు అత్యంత ప్రమాదకరం ఎందుకంటే అవి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు, రాడార్లకు చిక్కడం కష్టం, ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒక్కటి అనేక వార్హెడ్స్ను మోయగలవు. అరుణాచల్ ప్రదేశ్ సమీపం నుంచి వచ్చే మిస్సైళ్లకు హెచ్చరిక సమయం కేవలం 8–10 నిమిషాలు మాత్రమే.
భారత్ రక్షణ వ్యవస్థలు..
భారత్ వద్ద ఎస్–400 (రష్యా నుంచి), ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పృథ్వి ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు ఉన్నాయి. ఆకాశ్ ఎంజీ భరత్ వంటి స్వదేశీ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ఫేజ్–1, ఫేజ్ – 2 అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి శత్రు మిస్సైళ్లను ఆకాశంలోనే అడ్డుకోవడానికి రూపొందించబడ్డాయి. ఈఎంఐఎస్లటీ శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ను ట్రాక్ చేస్తుంది. ఇవన్నీ లేయర్డ్ డిఫెన్స్ (బహుళస్థాయి రక్షణ) ఏర్పాటు చేస్తాయి. ఎర్లీ వార్నింగ్, డిటెక్షన్ సిస్టమ్సి్మస్సైల్ ప్రయోగం జరిగిన వెంటనే గుర్తించడం చాలా ముఖ్యం. ఆర్ఐఎస్ఏటీ ఉపగ్రహాలు భూమి చిత్రాలు తీసి, లాంచ్ సైట్లోని మంటలు, పొగను గుర్తిస్తాయి. గ్రౌండ్ బేస్డ్ రాడార్లు, ఏడబ్ల్యూఏసీఎస్ విమానాలు ట్రాకింగ్ చేస్తాయి. డేటా డీఆర్డీవోకు పంపబడి, విశ్లేషణ జరుగుతుంది. బాలిస్టిక్ మిస్సైల్ ఎక్కువ ఎత్తుకు వెళ్లి, తర్వాత భూమిని చేరుతుంది కాబట్టి మధ్య దశలో ట్రాక్ చేయడం కష్టం.
ఇంటర్సెప్షన్ ప్రక్రియ, కమాండ్ వ్యవస్థ..
మిస్సైల్ గుర్తించగానే బీఎండీ కంట్రోల్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (2019లో ఏర్పాటు) రంగంలోకి దిగుతాయి. ఇందులో ఆర్మీ, నేవీ, వాయుసేన, విదేశాంగ శాఖ, డీఆర్డీవో, రక్షణ శాఖలు ఉంటాయి. మిస్సైల్ ఎక్కడ పడుతుందో, ఎప్పుడు చేరుతుందో విశ్లేషించి, ఆకాశంలో పేల్చాలా లేదా భూమికి దగ్గరగా అడ్డుకోవాలా అని నిర్ణయిస్తారు. టర్మినల్ ఫేజ్లో (భూమిని చేరే సమయం) కేవలం 1–2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. వార్హెడ్ను నాశనం చేయడం చాలా కష్టం.
అవసరమైన మెరుగుదలలు…
చైనా నుంచి వచ్చే మిస్సైళ్లకు హెచ్చరిక సమయం చాలా తక్కువ (7–9 నిమిషాలు). హైపర్ సోనిక్ మిస్సైళ్లను అడ్డుకోవడానికి ప్రస్తుత టెక్నాలజీ సరిపోదు. మాన్యువల్ కమాండ్ మీద ఆధారపడటం, స్పేస్ బేస్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లోపం. బాలిస్టిక్ మిస్సైళ్ల మధ్య దశలో ట్రాకింగ్ కష్టం. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను చిన్న ఏరియాలపై ఉపయోగించవచ్చు.
భారత్ రక్షణ వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతోంది, కానీ శత్రువుల ఆయుధ సామర్థ్యాలు, తక్కువ హెచ్చరిక సమయం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి టెక్నాలజీలో మరిన్ని పురోగతులు అవసరం. బలమైన డిటరెన్స్, ఆధునిక రక్షణ వ్యవస్థలు మాత్రమే భవిష్యత్ బెదిరింపులను తట్టుకోగలవు. దేశ రక్షణ అనేది నిరంతర అభివృద్ధి ప్రక్రియ.
