
హనీట్రాప్.. ఒకప్పుడు ఇది కేవలం సైన్యానికి మాత్రమే పరిమితమయ్యేది. దేశంలోని భద్రతా రహస్యాలు తెలుసుకునేందుకు శత్రు దేశాలు సైనికులకు అమ్మాయిలను ఎరవేసి ఈ ట్రాప్లోకి లాగేవి. క్రమంగా ఈ సంస్కృతి అన్ని విభాగాలకు విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణం కూడా హనీ ట్రాప్ అని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త(28) తాజాగా హనీట్రాప్లో పడ్డాడు. ఆమె తరపు వ్యక్తుల బెదిరింపులతో భయపడ్డాడు. వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పుట్టేనహళ్లి ఠాణా పోలీసులు మెహర్ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు.
టెలిగ్రామ్ యాప్తో ట్రాప్..
టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆ మహిళ యువ పారిశ్రామికవేత్తకు పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. తన భర్త దుబాయ్లో ఉంటున్నారని, తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని అతనికి చెప్పింది. తన వద్దకు వచ్చి నీ కోరిక తీర్చుకోవాలని తన చిరునామా లొకేషన్ పంపించింది.
ఆశ పడి వెళ్లి..
అమ్మాయి.. కోరిక తీర్చమని అడగడం, అడ్రస్ కూడా పంపించడంతో ఆ పారిశ్రామికవేత్త ఆగలేకపోయాడు. ఆహ్వానించడమే ఆలస్యం అన్నట్లు సదరు మహిళ ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ దగ్గరయ్యారు. కొన్ని రోజులు రాకపోకలు కొనసాగుతున్నాయి.
రంగంలోకి మరో ముగ్గురు..
ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరూ ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. యువ పారిశ్రామిక వేత్తను బెదిరించారు. ‘నువ్వు సున్తీ చేయించుకోవాలని, సదరు మహిళను వివాహం చేసుకోవాలి’ అ ని ఒత్తిడి చేశారు. తమ మాట వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. ఎలాగో ఒకలా ఆ నలుగురి నుంచి తప్పించుకు వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హానీట్రాప్ ఇప్పుడు వ్యాపారవేత్తలు, సంపన్నులకు కూడా విస్తరించింది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. క్షణం సుఖం కోసం ఆశపడితే మొదటికే మోసం వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.