Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్

CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్

CM Jagan Early Elections: జగన్ సర్కారు సంక్షేమ భారాన్ని మోయలేకుందా? పథకాల అమలుకు ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదా? ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిందా? ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సడలిందా? పార్టీలో అంతర్గత విభేదాలు కలవరపెడుతున్నా? ప్రజల విశ్వసాన్ని మరోసారి పొందాలంటే ముందస్తు ఎన్నికలే శరణ్యమా?..అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. సీఎం జగన్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ గెలుపొందింది. జగన్ అంతులేని విజయంతో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. విపక్షాలు దరిదాపులకు రానీయకుండా ఊర్చిపారేశారు.

CM Jagan Early Elections
CM Jagan

అయితే పాలనలో మాత్రం ఆ స్థాయిలో మార్కు చూపించుకోలేకపోయారు. సంక్షేమమే తారక మంత్రంగా భావించేరే తప్ప పాలనను, అభివ్రుద్ధిని గాలికొదిలేశారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. రాజధానిపై స్పష్టత లేకపోవడం, పోలవరంను పూర్తి చేయకపోవడం, అభివ్రుద్ధి మౌలిక వసతులు కల్పించకపోవడం తదితర కారణాలతో విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలు అదుపు చేయలేకపోయారు. అన్నిరంగాల్లో వైఫల్యాలు వెలుగుచూస్తుండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలే శరణ్యమని భావిస్తున్నారు. సరిగ్గా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజాభిప్రయానికి వెళ్లనున్నారన్న చర్చ సాగుతోంది. అందులో భాగంగానే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, పార్టీ ప్రాంతీయ, జిల్లా కార్యవర్గాలను ప్రకటించారు. ఒక విధంగా ఇది ఎన్నికల టీమేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read: Minister Roja: మిస్సయిన మంత్రి రోజా సెల్ ఫోన్. గంటల్లోనే గుర్తింపు.. మంత్రా మజాకా

ఈ రెండేళ్లూ ప్రజల్లో..
ఈ మూడేళ్లూ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారన్న అపవాదు ఉంది. అడపాదడపా పర్యటనలకు మినహాయించి ఎప్పుడూ ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు లేవు. ఇది కూడా ఆయనకు మైనస్ గా మారింది. ముందస్తు ఎన్నికల ఆలోచన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆయన ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ స్పీడు పెంచారు. నరసారావుపేట, నంద్యాలలో భారీ బహిరంగ సమావేశాల్లో మాటా్లడారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. గతం కంటే భిన్నంగా మాట్లాడి ఎన్నికల వ్యూహానికి తెరతీశారన్న టాక్ నడుస్తోంది.ఇకపై సభల్లో ప్రసంగించేందుకు జగన్ వీలైనంత తరచుగా జిల్లాల్లో పర్యటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.తన జిల్లా పర్యటనల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం.

CM Jagan Early Elections
CM Jagan Early Elections

ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటికే సీఎం పర్యటనల కోసం 2009 మరియు 2015లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసింది, అయితే ఇప్పుడు, జగన్ ప్రభుత్వం అటాచ్డ్ ప్యాంట్రీ మరియు వాష్‌రూమ్ మరియు ఇతర సౌకర్యాలతో కూడిన తాజా వాహనాలను కోరుకుంటోంది. ఇకపై జగన్ ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే ప్రయాణించనున్నారు. పర్యటనల సమయంలో, ముఖ్యమంత్రి గ్రామస్తులతో రచ్చ బండ నిర్వహిస్తారు మరియు వాటి పనితీరును పర్యవేక్షించడానికి గ్రామ సచివాలయాలను కూడా సందర్శిస్తారు. ప్రజలను ఆకర్షించేందుకు గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. జిల్లాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలపై ద్రుష్టి పెడతారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలన్నీ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని సూచిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో లేదా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందు ఉండవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:AP News: సీఎం కాన్వాయ్ కైతే కారు ఇవ్వాల్సిందేనా?

5 COMMENTS

  1. […] Telangana State Debt:  తెలంగాణలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్నా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా మారింది పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు దొందూ దొందే అన్న చందంగా మారాయి. ఉద్యోగులకు వేతనాలు సైతం సకాలంలోఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ మధ్య రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉద్యోగులకు వేతనాలు సరైన సమయానికి రావాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చెప్పిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్వవస్థ కుదేలైపోతోదని తెలుస్తోంది. మరి ధనిక రాష్ట్రంలో డబ్బులకు ఎందుకు కొదవుందో అర్థం కావడం లేదు. మరోవైపు ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్నా వారు ఎప్పుడు కూడా తమది ధనిక రాష్ర్టమని చెప్పుకోలేదు. మన ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణ ధనిక రాష్ట్రమని కాగ్ చెబుతోందని ఆధారాలు చూపుతున్నారు. కానీ అసలు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. […]

  2. […] YCP Alliance With Congress: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. మిత్రుడు శత్రువుగా మారుతారు… శత్రువే మిత్రుడవుతారు. దశాబ్దాల కాలంగా ఉన్న వైరం మరచి చంద్రబాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణాలో సైతం కాంగ్రెస్ తోనే నడిచారు. ఇప్పుడు ఆ వంతు జగన్ కు వచ్చింది. వచ్చే ఎన్నకల్లో ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారన్నటాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఆయనకు నేరుగా కాంగ్రెస్ తో ఎటువంటి సంబంధాలు లేవు. కనీసం కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన సందర్భాలూ లేవు. ఈ పరిస్థితుల్లో పొత్తు ఎలా సాధ్యమనుకుంటున్నారా? అదే వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఆ రెండు పార్టీలను కలిపే పనిలో పడ్డారు. దాదాపు జాతీయంగా, ఉత్తరాధి రాష్ట్రాల్లో తుడుచుపెట్టుకుపోయిన కాంగ్రెస్ కు పునరజ్జీవం పోసేందుకు ప్రశాంత్ కిశోర్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు గత కొద్దిరోజులుగా గుప్పుమంటున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular