Homeజాతీయ వార్తలుDelhi pollution movement: ఢిల్లీ కాలుష్య ఉద్యమం.. మావోయిస్ట్ హిడ్మా కోసం హైజాక్ చేశారు

Delhi pollution movement: ఢిల్లీ కాలుష్య ఉద్యమం.. మావోయిస్ట్ హిడ్మా కోసం హైజాక్ చేశారు

Delhi pollution movement: శీతాకాలం కావడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీవ్ర పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. ఈ పోరాటాలు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఉద్యమంలోకి మావోయిస్టులు, మార్క్సిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌ చొరబడి ఉద్యమాన్ని రాజకీయం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఆపరేషన్‌ కగార్, మడవి హిడ్మా మరణానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు. […]

Delhi pollution movement: శీతాకాలం కావడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీవ్ర పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. ఈ పోరాటాలు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఉద్యమంలోకి మావోయిస్టులు, మార్క్సిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌ చొరబడి ఉద్యమాన్ని రాజకీయం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఆపరేషన్‌ కగార్, మడవి హిడ్మా మరణానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు.

పర్యావరణ పోరాటానికి రాజకీయ రంగు..
ఇండియా గేట్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో ప్రదర్శకులు మావోయిస్ట్‌ నాయకుడు మడవి హిడ్మా పోస్టర్లు ప్రదర్శించి, ’బిర్సాముండా నుంచి మడవి హిడ్మా వరకు పోరాటం కొనసాగుతుంది’ అని నినాదాలు చేశారు. ఈ చర్యలు కాలుష్య సమస్యను వదిలి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు మార్పు తీసుకొచ్చాయి. పోలీసులు వీడియో ఆధారాలతో ఈ వ్యక్తులను గుర్తించి అరెస్టులు చేశారు.

పోలీసుల చర్యలు..
ఆందోళనకారులు బారికేడ్‌లను ధ్వంసం చేసి, పెప్పర్‌ స్ప్రే ఉపయోగించారు. దీంతో 15–22 మంది అరెస్టు అయ్యారు, ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఇండియా గేట్‌కు బదులు జంతర్‌ మంతర్‌లోనే ఆందోళనలు చేయాలని పోలీసులు హెచ్చరించినా పాటించలేదు.

ఉద్యమ వైపు ప్రభావం..
ఈ ఘటనలు పర్యావరణ ఉద్యమాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి, ప్రజల ఆగ్రహాన్ని విభజించాయి. ఢిల్లీ ఏక్యూఐ 391–444 మధ్య తిరుగుతున్నప్పటికీ, నిజమైన సమస్యల పరిష్కారం కాకుండా రాజకీయ ఎజెండాలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం జీఆర్‌ఏపీ చర్యలు పెంచినా ఫలితం ఉండడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper