spot_img
Homeజాతీయ వార్తలుNEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్ చేస్తుంటారు. ఇలా ఎవరికివారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా నీట్ పేపర్ లీకేజీ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చేపట్టే ఆందోళనలో భాగంగా చేస్తున్న నినాదాలు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం జరగాలని చేస్తున్న ఆందోళనలో ఇటువంటి నినాదాలు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. పైగా దేశంలో మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి నటుడు జైశ్రీరామ్ అనను అంటూ అదే వేదిక మీద చెబుతుంటాడు. ఇటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ కు సపోర్ట్ గా ఉంటారా. దీనికితోడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ముందుగా నిరసన శిబిరంలో విద్యార్థులను రెచ్చగొట్టారు. కచ్చితంగా పార్లమెంటు ముట్టడికి రావాలని పిలుపునిచ్చారు.

వచ్చిన విద్యార్థులలో నీట్ బాధితులు లేకపోవడం విశేషం. పైగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాత్రమే అక్కడ కనిపించారు. వారంతా కూడా పోలీసుల మీదికి రాళ్లు రువ్వారు. అంతేకాదు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులకు ఓపిక నశించి లాఠీ చార్జ్ చేశారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అక్కడ కనిపించలేదు. నిరసనకు పిలుపునిచ్చినవారు.. ఆందోళనలు చేద్దామని చెప్పినవారు అక్కడ మచ్చుకు కూడా కనిపించలేదు. కేవలం కొంతమంది మాత్రమే ఆ ఆందోళనలో ముందు వరుసలో ఉన్నారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. వారిలో చాలామందికి గాయాలయ్యాయి.

విద్యార్థుల పోరాటాన్ని హైజాక్ చేయడానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఎంట్రీ ఇచ్చింది. అక్రమంగా ఆప్.. టిఎంసి.. మిగతా పార్టీలు కూడా స్వరం సవరించుకోవడం మొదలుపెట్టాయి. నీట్ పేపర్ లీకేజీ గురించి నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఏం చేస్తుందో మర్చిపోతోంది. ఇటీవల కాలంలో తమకు పోలీస్ పోస్టులను పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారిపై పోలీసులను ప్రయోగించింది. కేరళ రాష్ట్రంలో కూడా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అక్కడి విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కి వేసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలను అమ్ముకుంది. ఇప్పటికి ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇలాంటి అవకాశవాద రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యమాన్ని తమకోసం వాడుకోవడం నిజంగా ఈ దేశం చేసుకున్న దురదృష్టం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper