Homeక్రైమ్‌Delhi auto deaths investigation: ఢిల్లీ ఆటో శవాలు.. దర్యాప్తులో హత్యగా నిర్ధారణ.. ఈ విషయంలోనూ...

Delhi auto deaths investigation: ఢిల్లీ ఆటో శవాలు.. దర్యాప్తులో హత్యగా నిర్ధారణ.. ఈ విషయంలోనూ మీడియా పక్షపాతం!

Delhi auto deaths investigation: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 11న మూడు శవాలను అక్కడి ప్రజలు గుర్తించారు. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిని విషప్రయోగంతో చంపినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన సంచలనం చేపింది.

ప్రసాదంలో విషం కలిపి…
ముగ్గురి మరణానికి కారణం విష ప్రయోగమని తేలింది. అయితే ఎవరు విషం పెట్టి ఉంటారని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టులో లడ్డూ ప్రసాధంలో విషం కలిపినట్లు గుర్తించారు. క్లూస్‌ ఆధారంగా విచారణ చేసిన పోటీసులు డబ్బులు వస్తాయని, ధనం కురుస్తుందని మోసపూరిత భావనలతో పూజలు చేయించి ఈ లడ్డూలు ఇచ్చారని, అందులో విషం కలిపారని గుర్తించారు. ఇందులో నిందితుడిగా మహ్మద్‌ కమ్రుద్దీన్‌ అని తేల్చారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని, ఫిరోజాబాద్‌ వాసిగా ధ్రువీకరించారు.

పేరు కూడా రాయలేని పరిస్థితిలో..
హత్య విషయంలో మతపరమైన అంశం లేదు. అయినా మన మీడియాకు సడెన్‌గా లౌకికవాదం గుర్తొచ్చింది. దీంతో ప్రముఖ పత్రికలు, డిజిటల్‌ మీడియా, న్యూస్‌ చానళ్లలో కూడా నిందితుడి పేరు రాయలేదు.. చెప్పలేదు. తాంత్రికుడు; యోగి, మంత్రగాడు, బాబా వంటి పర్యాయపదాలు వాడారు. ఎందుకంటే.. పేరు రాస్తే ఆ వర్గానికి చెందిన ప్రతిష్ట దెబ్బతింటుందేమో అని ఇలా పేరు దాచి ఉంటాయని హిందూ సంస్థలు భావిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular