spot_img
Homeజాతీయ వార్తలుCongress vs BJP : తండ్రి రెండుసార్లు సీఎం.. బీజేపీలో చేరనున్న తెలంగాణ  సీనియర్ నేత.. కాంగ్రెస్...

Congress vs BJP : తండ్రి రెండుసార్లు సీఎం.. బీజేపీలో చేరనున్న తెలంగాణ  సీనియర్ నేత.. కాంగ్రెస్ కు భారీ షాక్

Congress vs BJP : కాంగ్రెస్ లో ఆయన తండ్రి రెండు సార్లు  సీఎంగా చేశారు. మర్రి చెన్నారెడ్డి వారసుడిగా కాంగ్రెస్ లోనూ వెలుగు వెలిగారు.   కానీ తెలంగాణలోనే సీనియర్ నేత..  మర్రి శశిధర్ రెడ్డికి ఇప్పటికీ కాంగ్రెస్ పై వెగటు పుట్టింది. తెలంగాణలో రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ నావను విడిచి పటిష్టమైన బీజేపీ ఓడలోకి ఎక్కేందుకు రెడీ అయ్యారు. రోజురోజుకు బలపడుతున్న బీజేపీలో ఉంటేనే తన భవిష్యత్ బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చారు.

తెలంగాణ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి  కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మర్రి భేటి కావడం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేశాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్రహోంమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మర్రి బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలైంది.

-రేవంత్ రెడ్డిపై అసంతృప్తితోనే..
తెలంగాణ కాంగ్రెస్ ను టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి లీడ్ చేయడంపై ఆది నుంచి మర్రి శశిధర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇన్నాళ్లు ఉన్న తమను కాదని పక్కపార్టీ నుంచి వచ్చిన నేతకు పగ్గాలు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి దూరంగా జరిగారు. తెలంగాణ్ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం టాగూర్, రేవంత్ పైనా ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ లో కల్లోలానికి ఇద్దరే కారణమని ఆరోపించారు.

-కాంగ్రెస్ లోనే సీనియర్ గా మర్రి శశిధర్ రెడ్డి
మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగా కాంగ్రెస్ అధినాయకత్వంతో శశిధర్ రెడ్డి సన్నిహితంగా మెలిగారు. సీనియర్ నేతగా గుర్తింపు పొందాడు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో మర్రి శశిధర్ రెడ్డి, పీ జనార్ధన్ రెడ్డిలు కలిసి రాజకీయాలను శాసించారు. వైఎస్ కూడా వీరికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1992, 1994, 2004, 2009 ఎన్నికల వరకూ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2014లోనూ కాంగ్రెస్ తరుఫున సనత్ నగర్ లో పోటీచేసి అప్పటి టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2018లో పొత్తులో భాగంగా సనత్ నగర్ ను టీడీపీకి కాంగ్రెస్ కేటాయించింది. ఇక సోనియా, రాహుల్ వద్దకు నేరుగా వెళ్లి కూడా మాట్లాడేంత చొరవ, పరపతి మర్రి సొంతం.

తొలి నుంచి కాంగ్రెస్ లోనే ఉండి.. కాంగ్రెస్ లోనే ఎదిగిన మర్రి కుటుంబం ఇలా బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడం వల్లనే మర్రి మారారని అంటున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న చాలా మంది పార్టీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని సమాచారం. మరికొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు బీజేపీలోకి ఉండబోతున్నాయనట.. అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను కుదేలు చేసి.. టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఈ సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీకి బలంగా ఉంటారని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదించారని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper