Homeజాతీయ వార్తలుCongress Party: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే

Congress Party: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే

Congress Party: కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అయిదు రాష్ట్రాల్లో పరాభవం దృష్ట్యా పార్టీని గాడిలో పెట్టే క్రమంలో పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందుకు గాను పీసీసీ అధ్యక్షుల మార్పు చేపడుతోంది. అయిదు రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులను మార్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోలేకపోయింది.

sonia, rahul
sonia, rahul

పంజాబ్ లో అధికారంలో ఉన్నా స్వయంకృతాపరాధంతో పార్టీ నిలువునా మోసపోయింది. అధికారం కోసం కనీసం పోరాటం కూడా చేయలేదు. ప్రతిపక్ష హోదాలో కూడా సరైన స్థానాలు దక్కించుకోలేకపోయింది. కేవలం 18 సీట్లకే పరిమితమై పరువు పోగొట్టుకుంది. దీంతో అయిదు రాష్ట్రాల్లో అడ్రస్ గల్లంతయింది. ఇక్కడ బీజేపీ కూడా తగినన్ని సీట్లు గెలుచుకోలేకపోయింది.

Also Read:  పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.2వేల కోట్ల మోసం.. ఆర్బీఐ ముందుకు వివాదం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ జారీ చేసిన ఆదేశాలను పాటిస్తూ పీసీసీ అధ్యక్షులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ీ మేరకు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయనే విషయం అందరికి అర్థమవుతోంది.

congress party
congress party

త్వరలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చర్యలు చేపడుతోంది. పీసీసీ అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. పీసీసీ అధ్యక్షులను మార్చి కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియాగాంధీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు గాను పార్టీలో యువ నేతలకు స్థానాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్ లోనైనా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Also Read: కాంగ్రెస్ నేత మల్లు భట్టికి ఓఫెన్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

4 COMMENTS

  1. […] CM KCR:  జీవో నెం. 111 ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. దీన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోపై అందరిలో ఆసక్తి నెలకొంది. 1996లో అప్పటి ప్రభుత్వం జంట నగరాల్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో జీవోను తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టరాదని సూచించింది. దీంతో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలకు సైతం అనుమతులు రావడం లేదు. ఫలితంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular