spot_img
Homeజాతీయ వార్తలుCM Vijay simplicity viral news: సీఎం విజయ్ అన్నా.. నీ సింప్లిసిటీ సూపర్.. ఫిదా...

CM Vijay simplicity viral news: సీఎం విజయ్ అన్నా.. నీ సింప్లిసిటీ సూపర్.. ఫిదా అంతే

CM Vijay simplicity viral news: ఒకప్పుడు జనాలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే గొప్ప గొప్ప పనులు చేయాల్సి వచ్చేది. పైగా ఆ పనులు జనాలకు రీచ్ కావాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా వచ్చేసింది. ప్రతి వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి జీవితాన్ని మొత్తం సోషల్ మీడియా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దానిని ఆధారంగా చేసుకుని చాలామంది సెలబ్రిటీలు అవుతున్నారు. సెలబ్రిటీలు అయినవారు తమ స్థానాన్ని మరింత గొప్పగా కాపాడుకుంటున్నారు.

రాజకీయాలలో ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం అంతగా ఉండేది కాదు. ఇప్పుడు రాజకీయాలను మించి సోషల్ మీడియా ఎదిగిపోయింది. అది రాజకీయ నాయకుడికి సోషల్ మీడియాలో ఖాతా ఉంది. గ్రూపులు.. ఇతర వ్యవహారాల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ప్రత్యేక బృందాలను కొనసాగిస్తున్నారు. ప్రజలలో రీచ్ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఇండియావ్యాప్తంగా సోషల్ మీడియా మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత.. ఇంకా కొంతమంది పేరు పొందిన నాయకుల తర్వాత విజయ్ చుట్టూ తిరుగుతోంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించడానికి ఆయన అనేక రకాల కష్టాలు పడ్డారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సంచలన నిర్ణయాలతో దేశ రాజకీయాలలోనే చర్చనీయాంశమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. విజయ్ ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు నోట్ బుక్.. పెన్నుతో కనిపించారు. సభ్యులు మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. వాస్తవానికి విజయ్ తలుచుకుంటే ఆపిల్ ఐపాడ్.. ఇంకా అత్యాధునిక పరికరాలు ఆయన చేతి ముందు వచ్చి వాలిపోతాయి. ఆయనప్పటికీ ఆయన అవి కోరుకోలేదు. అసెంబ్లీలో ఆయన నోట్ బుక్ లో నోట్ చేసుకున్న పాయింట్లు.. ఆయన వ్యవహరించిన తీరుకు గుర్తుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. సెక్రటేరియట్ కు వచ్చేముందు విజయ్ సొంతంగా క్యారియర్ తెచ్చుకుంటున్నారు. ఇంట్లో భోజనం మాత్రమే తింటున్నారు. తన కాన్వాయ్ కూడా చాలావరకు తగ్గించుకున్నారు. ఇటీవల తమిళనాడులో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే అమ్మాలని.. గుర్తింపు కార్డు ఇస్తేనే మద్యం విక్రయించాలని.. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు.. గుడి, బడి, మసీదు, చర్చి దగ్గర మద్యం షాపులు ఉండకూడదని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం విజయ్ చుట్టూ తిరుగుతోంది. విజయ్ పెట్టుకున్న పీఆర్ బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. చూడాలి మరి విజయ్ ఇంకా ఎన్ని రోజులు సోషల్ మీడియాను తన చుట్టూ తిప్పుకుంటారో..

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular