Bandi Sanjay Kumar: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టం తెస్తామని పేర్కొన్నారు. దేశ జనాభా ఒక వర్గంతో విపరీతంగా పెరిగిపోతుందని, దీంతో ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందేలా చేస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం మీద పోటీ చేసే ధైర్యం లేని టీఆర్ఎస్ పార్టీ మొత్తం దానికి మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని సవాల్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ బలోపేతం కావడానికి చర్యలు చేపడుతున్నారు. అధిష్టానం మద్దతుతోనే పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అడుగడుగునా నేతలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు.
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ఎందుకు జరపడం లేదు. నిర్మల్ లో బీజేపీ నిర్వహించే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే బీజేపీ కార్యకర్తలకు హితోపదేశం చేయనున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా తయారు చేయాలని పిలుపునివ్వనున్నారు. రాష్ర్టంలో కుటుంబ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. ఇంక సాగదు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
పాదయాత్రలో బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాష్ర్ట ప్రభుత్వం తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు నష్టం చేసేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చి తరువాత వాటిని పూర్తిగా మరిచిపోయి రాక్షస పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. కన్నీరు, అప్పులు, నిరుద్యోగం రాష్ర్టంలో విలయతాండవం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి సాధించాలనే బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు