Homeఆంధ్రప్రదేశ్‌'ఎస్.ఈ.సీ' అంశంపై ప్రభుత్వానికి ఎదురు దెబ్బ!

‘ఎస్.ఈ.సీ’ అంశంపై ప్రభుత్వానికి ఎదురు దెబ్బ!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విషయంలో పదవీ కాలం కుదిస్తూ, నియామక నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్​ వివాదాస్పదమయ్యింది. సెలవు రోజుల్లో హడావిడిగా రమేశ్​ కుమార్​ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా మద్రాస్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ కనగరాజ్​ బాధ్యతలు చేపట్టారు. ఇదంతా కేవలం కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. జగన్ ప్రభుత్వం చేసిన ఈ అంశంపై హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రమేష్ కుమార్ స్వయంగా ఒక పిటీషన్, టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నరసరావుపేట కు చెందిన మరో వ్యక్తి పిటీషన్ లు దాఖలు చేశారు. పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం విచారణ జరిపింది. ఈ నెల 16 నాటికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

అయితే ఈ సందర్భంలో, కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు పై వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ తరుపు అడ్వొకేట్ జనరల్, తమకు ఈ కేసు పై వాదనలు జరపటానికి, చాలా కాలం కావలి అని, కనీసం నెల రోజులు సమయం తమకు ఇవ్వాలని, ధర్మాసనాన్ని కోరారు. అయితే, కోర్ట్ మాత్రం, ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ అభ్యర్ధనను సమర్ధించలేదు. నెల రోజుల సమయం ఇవ్వటం కుదరదు అని కోర్ట్ చెప్పింది. కేవలం మూడు రోజులే సమయం ఇస్తామని, ఏప్రిల్ 16 లోపు, కౌంటర్ దాఖలు చెయ్యాలని, అడ్వకేట్ జనరల్ ను కోరింది.

అలాగే, పిటీషన్ దాఖలు చేసిన అందరూ, 17లోపు అభ్యర్ధనలు ఉంటే తెలపాలి అంటూ కోర్ట్ తెలిపింది. కౌంటర్లు, అభ్యర్ధనలు చూసిన తరువాత, వచ్చే సోమవారం అంటే, ఏప్రిల్ 20న ఈ విషయం పై వాదనలు వింటామని హైకోర్ట్ తెలిపింది. అయితే ఇదే సందర్భంలో, ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఇది కేవలం సర్వీస్ మేటర్ మాత్రమే అని, ఈ విషయంలో మిగిలిన వారు పిటీషన్లు దాఖలు చేయటం కరెక్ట్ కాదని వీరి పిటీషన్లు కొట్టేయాలని కోరారు. పిటీషనర్ల తరుపున హాజరైన జంధ్యాల రవి శంకర్ వాదిస్తూ ఇది కేవలం సర్వీస్ మేటర్ మాత్రమే కాదని, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉందని తెలిపారు. అందుకే మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశామని చెప్పారు. అయితే తమకు వీరు వేసిన పిటీషన్లు తమ దగ్గర లేవని, అడ్వకేట్ జనరల్ చెప్పటంతో, ఆ పిటీషన్లు అన్నీ అడ్వకేట్ జనరల్ కు కూడా ఇవ్వాలని, కోర్ట్ తెలిపింది. మొత్తానికి, ఈ కేసును నెల రోజులు పాటు సాగదియ్యటానికి ట్రై చేసిన ప్రభుత్వానికి, కోర్ట్ దగ్గర ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular