తెలంగాణాలో దిశ తరహాలో మరో ఘటన జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఉదయం తంగడిపల్లి శివారులో ఓ బ్రిడ్జి కింద ఓ గుర్తు తెలియని 30 ఏళ్ళ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం బండరాయితో ఆమె తలపైన బాదడం వంటి ఆనవాళ్లు ఉండడంతో అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ఆ మహిళ దుస్తుల జాడ ఇంకా ఎలాంటి క్లూ కనపడక పోవడంతో పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. కాగా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Another disha incident in rangareddy district chevella
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com