Monsoon Diet: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ఏరులై పారుతున్నాయి. మొన్నటి వరకు ఎండలతో మాడిన ప్రజలు ఇప్పుడు చల్లదనంతో హాయిగా ఉంటున్నాయి. వర్షాలత వాతావరణం చాలా కూల్ గా ఉంటుంది. కానీ ఇదే సమయంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. చాలా మంది వర్షం రాగానే వేడి వేడి భజ్జీలు, ఆనియన్ పకోటి లాంటివి తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల తాత్కాలికంగా ఆనందమే ఇస్తుంది. అయితే ఆ తరువాత అవస్థలు పడే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం బెటర్? ఒకసరి పరిశీలిద్దాం..
వానలు కొడుతున్న సమయంలో చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. అత్యవసర సేవలు అందించే వారు మినహా దాదాపు అందురూ ఇళ్లును వీడరు. ఈ సమయంలో తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం లేదు. దీంతో ఆజీర్తి సమస్యలు వస్తాయి. పైగా వాతావరణం కూల్ గా ఉండడంతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. దీంతో డైజేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. అయితే ఈ సమయంలో ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కావు.
అలాగే ఈ సమయంలో ఆకుకూరలు అస్సలు తినకూడదు. ఆకు కూరల్లో చిన్న చిన్న కీటకాలు దాగి ఉండే అవకాశం ఉంది. కొన్ని వేడి చేసినా తగ్గే అవకాశం లేదు. అలాగే ఆకు కూరలను ఇంట్లోకి తీసుకురావడం వల్ల వాటితో పాటు క్రిములు ఇంట్లో చేరి ఇతర పదార్థాలు చెడిపోతాయి. అందువల్ల ఈ సమయంలో వీటి జోలికి పోకుండా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా మాంసానికి దూరంగా ఉండడం అంత మంచిది కాదని చెబుతున్నారు. జలరాశుల విషయంలోనూ చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వర్షాకాలం రాగానే చాలా మంది చేపలు తినడానికి ఇష్టపడుతారు. అయితే కొన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన క్రిములు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయని అంటున్నారు.
మరి ఈ సమయంలో ఏం తినాలి? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. వర్షాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది. కాబట్టి కాస్త వేడి చేసే పదార్థాలను తీసుకోవచ్చు. అల్లంతో చేసే కాషాయాన్ని తీసుకోవాలి. పైన చెప్పిన వాటిని కాకుండా ఇతర కూరగాయలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగా తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ సమయంలో బయటఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు.