Nagabhushanam : నాగభూషణం అనే పేరు వినిపిస్తే చాలు విలన్ పాత్రలు గుర్తు వస్తాయి. ఈయన నటనా రంగం మొత్తం విలనిజమే.. అయితే ఆయన అసలు పేరు ఎలా ఉన్నా.. ఏదైనా కూడా రక్తకన్నీరు నాటకాలతో ప్రసిద్ది చెందారు నాగభూషణం. దీంతో రక్తకన్నీరు నాగభూషణం అనే పేరు చిరకాలం నిలిచిపోయేలా ఉండిపోయింది. ఆయన సినిమాల కంటే కూడా నాటకాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారట. దీంతో ఆయన గ్యాప్ దొరికితే చాలు.. తెనాలి నాటకాల ట్రూప్ లతో కలిసి.. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో నాటకాలు వేసేవారట.
ఇప్పటికీ రాజమండ్రిలో నాగభూషణం నెలకొల్పిన నాటక సంస్థ ఉందట. అప్పుడప్పుడు ఈ సంస్థ నాటకాలు వేస్తూనే ఉంది. అయితే సినిమా రంగంలోకి వచ్చాక నాగభూషణం తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందరిలాగానే ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు వేశాలు వేశాక.. ఆయనకు బోర్ కొట్టిందట. ఎందుకంటే బాగా గ్యాప్ వచ్చేసిందట. దీంతో సినిమాల్లోకి ఏ వెళ్తాంలే అబ్బా.. అనేవారట.
ఒకసారి ఆయనకు అన్నగారి నుంచి కబురు వచ్చిందట. అప్పట్లో ఫోన్లు కూడా ఉండేవి కాదు. అన్నగారు లేఖ రాశారట. తమ్ముడు నాగభూషణానికి అని మొదలు పెట్టి.. తను తీస్తున్న ఒక సినిమాలో వేషం ఇస్తామని పిలిచారట. దీంతో నాగభూషణం సర్కార్ ఎక్స్ ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్లిపోయారట. ఇలా ఆయన మూడో చిత్ర భట్టి విక్రమార్కతో ప్రారంభమైంది. ఈ సినిమాలో మూడే సీన్లు ఉంటాయి. కానీ వేదాంతం రాఘవయ్య దర్శకుడు కావడంతో నాగభూషణం దశ తిరిగింది అనే చెప్పాలి.
ఈ సినిమాకే ఆయన తొలి పారితోషికం అందుకున్నారు. అప్పటికీ జీతాల ప్రస్తావన ఉన్నా.. అంజలీదేవి నటి కావడంతో ఆమె జీతాలు ఏం సరిపోతాయంటూ.. పారితోషికాలు ఇచ్చేవారట. ఇలా నాగభూషణానికి రోజుకు రూ.200 చొప్పున ఇచ్చారట. ఈ సినిమాలో మాంత్రికుడి శిష్యుడిగా ఆయన చేశారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఇక నాగభూషణం ఫుల్ బిజీ అయిపోయారు. కానీ మొత్తం మీద చిన్న పాత్ర అయినా మంచి పేరు తెచ్చింది. అంతేకాదు ఆ రోజుల్లో రూ. 200 అంటే అవే ఎక్కువండోయ్…