Tollywood directors: తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న దర్శకులు పాన్ ఇండియాలో మన సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపిస్తున్నారు. కొంతమంది దర్శకులు మాత్రం సక్సెస్ లు ఉన్న ఫెయిల్యూర్స్ వచ్చిన కూడా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తారు. మీడియం రేంజ్ హీరోలను అస్సలు పట్టించుకోరు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు వంశీ పైడిపల్లి కాగా, మరొకరు మెహర్ రమేష్ కావడం విశేషం. వంశీ పైడిపల్లి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆయన ఇప్పటివరకు 6 సినిమాలే చేశాడు అంటే ఆయన హీరోల కోసం ఎంతలా ఎదురుచూస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల డేట్లు దొరికిన తర్వాతే సినిమాను చేస్తాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది…
ఇక మెహర్ రమేష్ కెరియర్ లో చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫెడౌట్ అయిపోయాడు. నిజానికి మెహర్ రమేష్ మొదటి నుంచి కూడా స్టార్ హీరోలతోనే సినిమాలు చేశాడు. సినిమాలు లేకపోతే ఖాళీగా అయిన ఉంటున్నాడు తప్ప ఆయన వేరే హీరోలతో సినిమాలు చేయడం లేదు.
Also Read: రాజమౌళి డైరెక్షన్ లో శ్రీహరి హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయిందా..? ఎందుకు ఆగిపోయిందంటే..?
ఆయన్ని స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తే సినిమా చేస్తారంట. లేకపోతే మాత్రం ఖాళీగా ఉంటాను తప్ప వేరే హీరోలతో సినిమాలు చేయనని మడికట్టుకు కూర్చున్నాడు… కెరియర్ లో ఒక్క సక్సెస్ లేనప్పుడు ఒక మంచి కథను రాసుకొని మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసి సక్సెస్ ని సాధిస్తే స్టార్ హీరోల నుంచి ఆటోమేటిక్ గా పిలుపు వస్తుంది కదా అంటూ మరి కొంతమంది చెబుతున్నారు.
అయినప్పటికి మెహర్ రమేష్ మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. ఇక వంశీ పైడిపల్లి సైతం స్లో గా సినిమాలను చేస్తాడు అనే ఒక పేరైతే ఉంది. ‘వారసుడు’ సినిమా భారీ డిజాస్టర్ అయిన తర్వాత మరో సినిమా అయితే స్టార్ట్ చేయలేదు. తొందరలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
