Manchu Family: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ పై ఎలాంటి అంచనాలు లేకపోవడం కలెక్షన్స్ దారుణంగా వచ్చాయి. ఇక కొందరు కావాలనే తమను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నారంటూ కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఆరోపించారు. ‘సెలెబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ చూసి చాలా బాధ పడుతున్నా. నేను సాధారణంగా వాటిని పట్టించుకోను. ఇద్దరు హీరోలు కొందరిని అపాయింట్ చేసుకుని ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఏదో ఒకరోజు వాళ్లకు శిక్ష తప్పదు’ అని మోహన్ బాబు అన్నారు.
ఇంతకీ మంచు ఫ్యామిలీ పై మీమ్స్ మరియు ట్రోల్స్ సృష్టించడం వెనుక ఆ ఇద్దరు టాలీవుడ్ నటులు ఎవరు ? టాలీవుడ్ నటులు పనులాపుకొని ఎదురు డబ్బులిచ్చి మరీ స్నో ఫ్యామిలీని ట్రోల్ చేసే అంత ఖాళీగా లేరు.
Also Read: భీమ్లా నాయక్ పోస్టర్ వైరల్.. ఆ ఫొటో వెనుక కథేంటి?
అసలు జులాయిలో చెప్పినట్టు ” స్విమ్మింగ్ పూల్ లో సునామీ వస్తుందా? నిన్నాపడానికి దేవుడు దిగి వస్తాడా?” అని…. వీళ్ళని ట్రోల్ చేయడానికి పెద్ద పెద్ద హీరోలు దిగి రావాలా ? వాళ్ళ అందం – అభినయం – నాట్యం – భాషా ప్రావీణ్యం వారి ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవే వాళ్ళని ట్రోల్ చేసేందుకు స్కోప్ ఇస్తున్న అంశాలు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ కలెక్షన్లు దారుణంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు ముందే చెప్పాయి. ఆ ఊహాజనిత కలెక్షన్సే నిజం అయ్యాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ను లెక్కేస్తే.. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది.
Also Read: యాడ్స్ ద్వారా మహేష్ సంపాదన ఎంత..? ఆ మొత్తం ఏం చేస్తాడో తెలుసా?
Recommended Video:
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More