Tarun Bhaskar divorce news: ‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ‘తరుణ్ భాస్కర్’ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డుని అందుకున్నాడు. ఈ సినిమాతో తను టాప్ డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా పెను సంచనలను క్రియేట్ చేస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక అప్పటినుంచి తను మరో సినిమా అయితే డైరెక్షన్ చేయడం లేదు. ప్రస్తుతం ఆయన నటన వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఆయన మెయిన్ లీడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలైతే తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ప్రేక్షకులను అలరించనప్పటికి ఆయన ఎక్కడ కూడా తగ్గడం లేదు. గాయపడ్డ సింహం’ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది…
ఇక ఇప్పటివరకు తరుణ్ భాస్కర్ చేసిన సినిమాలు అతన్ని ఎప్పటికప్పుడు నటుడిగా మంచి ఇమేజ్ లు తీసుకొచ్చి పెట్టాయి. అయితే ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బాతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. ఆమెతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇంతకుముందే తరుణ్ భాస్కర్ లతా నాయుడు అనే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు.
కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ ఇప్పుడు సపరేట్ అయిపోయారు. ఇంకా విడాకులు మాత్రం తీసుకోలేదు. ఒక దాంతో రీసెంట్ గా తరుణ్ భాస్కర్ విడాకులకు అప్లై చేశాడు. మొత్తానికైతే విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక లతా నాయుడుకు విడాకులు ఇస్తున్నందుకు ఆమెకు భరణంగా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించబోతున్నట్లు తెలుస్తుంది.దాదాపు 30 కోట్ల వరకు ఆమెకు భరణంగా ఇవ్వబోతున్నారట. ఈ లెక్కన తరుణ్ భాస్కర్ మొదటి నుంచి కూడా చాలా రిచ్ అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన దాదాపు 100 కోట్లకు పైనే ఆస్తులను సంపాదించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…