నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం డైరెక్టర్స్ కి అందుబాటులో లేదని తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ టైంలో కూడా ఆమెకు కథ చెప్పడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా, సాయి పల్లవి మాత్రం సినిమాల పై ప్రజెంట్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. అలాగే గతంలో విన్న కథల పై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని, అందుకే ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
అయినా, సాయిపల్లవికి సినిమాల ఎంపిక తెలియదు అంటూ ఇప్పటికే ఆమె పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లో నటించమని ఆఫర్ వచ్చినా… ఆ క్రేజీ సినిమాని వదులుకుంది. అయితే ఈ రీమేక్ లో తనది చిన్న పాత్ర కావడం వల్లే ఈ సినిమాని తిరస్కరించాను అంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
కానీ, పవర్ స్టార్ పక్కన చిన్న పాత్ర అయినా.. పెద్ద పాత్ర అయినా పవన్ హీరోయినే అంటారు కదా, ఎందుకు ఆ సినిమా వదులుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో సాయిపల్లవి పై పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ కూడా చేశారు. అయినా తన శైలిని మాత్రం అలాగే కొనసాగిస్తోంది సాయి పల్లవి. పై కొత్త సినిమాలను కూడా త్వరగా అంగీకరించట్లేదట. తన పాత్ర తనకు నచ్చితేనే ఆ సినిమా చేస్తాను, లేదంటే లేదు అంటూ తేల్చి చెబుతోంది.
ప్రస్తుతానికి అయితే, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత ఈ సినిమాలను రిలీజ్ చేయనున్నారు. అలాగే, నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కూడా సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా ఎలాగూ ఇప్పటికే సగం పూర్తి అయిందని తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు తప్పా సాయిపల్లవి చేతిలో మళ్ళీ ఆ రేంజ్ సినిమా లేదు. ఇలా అయితే సాయి పల్లవి కెరీర్ కష్టమే.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sai pallavi career is difficult like this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com