Homeఎంటర్టైన్మెంట్100 ఎకరాలు కొన్న యాంకర్ రష్మీ..

100 ఎకరాలు కొన్న యాంకర్ రష్మీ..

తెలుగులో బుల్లితెర యాంకర్ గా రాణిస్తూ మంచి జోరు మీదుంది రష్మీ. జబర్దస్త్ షో తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. రష్మీ అడపాదడపా సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా రష్మీకి సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 100 ఎకరాలను కొనుగోలు చేసి వ్యవసాయం చెయ్యాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Read More:‘ఇండియన్-2’ షూటింగ్లో ప్రమాదం.. ముగ్గురి మృతి

రష్మీ సంపాదించిన డబ్బుతో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో తన సొంత ఊరైన బెహ్రాంపూర్ అనే ప్రదేశంలో రష్మీ 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం దాదాపు రూ.5కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ 100ఎకరాల్లో కోకా, యూకలిప్టస్‌, మామిడి, నేరేడు వంటి పంటలను పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం మరి ఈ వార్తలపై రష్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular