అందాల తార శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపారవేత్తగా సక్సెస్ అయినా, ఆయన మాత్రం జీవితంలో ఎంతో నరకాన్ని అనుభవించారు. శిల్పా శెట్టిని వివాహం చేసుకోక ముందు, కవిత అనే ఆమెతో రాజ్ కుంద్రాకు పెళ్లి జరిగింది. అయితే, వివాహం అనంతరం ఈ జంట విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకోవడానికి గల చేదు జ్ఞాపకాన్ని తాజాగా రాజ్ కుంద్రా చెప్పుకొని బాధ పడ్డారు.
తన మొదటి భార్య కవిత, మా చెల్లి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఈ విషయం బయటపడడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. బయట అందరూ అనుకుంటున్నట్లు నేను నా మొదటి భార్య కవితతో విడిపోవడానికి శిల్పాశెట్టి కారణం కాదు. నిజానికి నేను నా మొదటి భార్యతో విడిపోయిన తరువాతే శిల్పాని కలిశాను అంటూ తన మొదటి భార్య గురించి చెబుతూ.. మేము అప్పట్లో లండన్లో ఉన్నాం.
ఆ సమయంలో నా తల్లిదండ్రులతోపాటు నా చెల్లి, ఆమె భర్త కూడా మా ఇంట్లోనే ఉండేవారు. ఇక్కడే తప్పు జరిగింది. నా చెల్లి భర్తతో నా మొదటి భార్య కవిత ఎఫైర్ పెట్టుకుంది. కవిత ప్రవర్తన గురించి, ఆమె నా చెల్లి భర్తతో సాగిస్తున్న రంకు గురించి అందరూ చెప్పారు. చివరకు నా కారు డ్రైవర్ కూడా వాళ్ల గురించి చెప్పి బాధ పడ్డాడు. అయినా నేను తొందర పడలేదు. కవితకు నచ్చచెప్పి ఆమెను మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను.
అలాగే మా చెల్లి, ఆమె భర్తను లండన్ నుండి ఇండియాకి పంపించాం. కానీ, ఆ తర్వాత కూడా కవిత నన్ను మోసం చేసింది. వరసకి సోదరుడు అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగించింది. నాకు తెలియకుండా రహస్యంగా ఒక సెల్ఫోన్లో అతనికి తరచూ మెసేజ్ లు చేస్తూ.. రహస్యంగా అతన్ని కలుస్తూ ఉండేది. ఓ రోజు ఇవ్వన్నీ నా కంట పడ్డాయి. ఆ పచ్చి రంకు బయటపడింది. ముఖ్యంగా ఆమె సెల్ ఫోన్లో మెస్సేజ్లు చూసి నా మనసు ముక్కలైంది. ఆ నిముషమే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకుని, కవిత నుంచి విడాకులు తీసుకున్నాను.